Ambedkar Konaseema: బడుగువానిలంకకు పొంచి ఉన్న వరద ముప్పు..
- బడుగువానిలంకకు పొంచి ఉన్న వరద ముప్పు
- ఇప్పటికే గ్రామాన్ని చుట్టుముట్టిన గోదారమ్మ
- ఆరు పడవలు సిద్దం
- చెముడులంకలో పునరావాస కేంద్రం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పూర్తి గోదావరి నది మధ్యలో ఉండే ఆ బడుగువానిలంక గ్రామానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Gujarat: పెళ్లైన ఏడాదికి బయటపడ్డ భార్య సీక్రెట్.. డాక్టర్ వద్దకు వెళ్లడంతో తెలిసిన నిజం..
Also Read
- Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే రోడ్లు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతాయి. అందుకే ఆరు మరబోట్లను సిద్ధం చేశారు. అలాగే 50 లైఫ్ జాకెట్లు, బియ్యం, మంచినీళ్లు ప్యాకెట్లు,నిత్యావసర సరకులను ఏర్పాటు చేస్తున్నారు. మరింత వరద నీరు చేరితే ఆ ఊరిలో ఉండే 1,114 కుటుంబాలకు చెందిన సుమారు 3,600 మంది ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు రెవెన్యూ అధికారుల ఆద్వర్యంలో చర్యలు చేపడుతున్నారు.రోడ్డుపైకి నీరు అధికంగా చేరుతున్నందున రోడ్డుకు ఇరువైపులా కర్రలు, తాళ్లు కట్టి ప్రమాద హెచ్చరిక ఎర్ర జెండాలు ఏర్పాటు చేసారు. అలాగే ఆ గ్రామంలో వారికి పునరావాస కేంద్రంగా చెముడులంక శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా గ్రామంలో చొప్పెల్ల పిహెసి ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
Ministry of Finance: విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమా..?
వరద ప్రమాద హెచ్చరికల అధికారులు సూచనల ప్రకారం ఇక్కడ పునరావాస ఏర్పాట్లు చేపడుతామని ఆలమూరు తాసిల్దార్ డి.వి.ఎన్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన గ్రామంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ గోదావరి పరిహార ప్రాంతాలకు రానీయకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!