Ambedkar Konaseema: బడుగువానిలంకకు పొంచి ఉన్న వరద ముప్పు..
- బడుగువానిలంకకు పొంచి ఉన్న వరద ముప్పు
- ఇప్పటికే గ్రామాన్ని చుట్టుముట్టిన గోదారమ్మ
- ఆరు పడవలు సిద్దం
- చెముడులంకలో పునరావాస కేంద్రం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పూర్తి గోదావరి నది మధ్యలో ఉండే ఆ బడుగువానిలంక గ్రామానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Gujarat: పెళ్లైన ఏడాదికి బయటపడ్డ భార్య సీక్రెట్.. డాక్టర్ వద్దకు వెళ్లడంతో తెలిసిన నిజం..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే రోడ్లు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతాయి. అందుకే ఆరు మరబోట్లను సిద్ధం చేశారు. అలాగే 50 లైఫ్ జాకెట్లు, బియ్యం, మంచినీళ్లు ప్యాకెట్లు,నిత్యావసర సరకులను ఏర్పాటు చేస్తున్నారు. మరింత వరద నీరు చేరితే ఆ ఊరిలో ఉండే 1,114 కుటుంబాలకు చెందిన సుమారు 3,600 మంది ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు రెవెన్యూ అధికారుల ఆద్వర్యంలో చర్యలు చేపడుతున్నారు.రోడ్డుపైకి నీరు అధికంగా చేరుతున్నందున రోడ్డుకు ఇరువైపులా కర్రలు, తాళ్లు కట్టి ప్రమాద హెచ్చరిక ఎర్ర జెండాలు ఏర్పాటు చేసారు. అలాగే ఆ గ్రామంలో వారికి పునరావాస కేంద్రంగా చెముడులంక శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా గ్రామంలో చొప్పెల్ల పిహెసి ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
Ministry of Finance: విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమా..?
వరద ప్రమాద హెచ్చరికల అధికారులు సూచనల ప్రకారం ఇక్కడ పునరావాస ఏర్పాట్లు చేపడుతామని ఆలమూరు తాసిల్దార్ డి.వి.ఎన్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన గ్రామంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ గోదావరి పరిహార ప్రాంతాలకు రానీయకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!