జనవరి 22న రామ్లల్లాకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి రోజుకు సగటున 2 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. దీని కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు సహా ఇతర వ్యాపారాలు పెరిగాయి. అనేక అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఔట్లెట్లను అయోధ్యలో తెరవాలని ప్లాన్ చేస్తున్నాయి. డొమినోస్, పిజ్జా హట్ వంటి చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ ఐటెమ్లకు ప్రసిద్ధి చెందిన అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కేఎఫ్సీ తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. అయితే.. కేఎఫ్సీ తన మెనూని మార్చుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అయోధ్యను మాంసాహార ప్రాంతంగా ప్రకటించారు. ఇక్కడ మాంసం ఉత్పత్తులను విక్రయించరు. రామ మందిరం చుట్టూ 15 కి.మీ ఉన్న పంచ్ కోసి మార్గ్ పరిధిలోని ప్రాంగణంలో మద్యం, మాంసం అమ్మకాలను అధికారులు అనుమతించరు.
Read Also: Ajit Pawar: శరద్ పవార్కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్దే..
రామాలయం చుట్టూ మాంసాహారాన్ని అనుమతించనందున.. అయోధ్య-లక్నో హైవేపై KFC తన యూనిట్ను ఏర్పాటు చేసినట్లు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ తెలిపారు. కేఎఫ్సీ శాఖాహార వస్తువులను మాత్రమే విక్రయించాలని నిర్ణయించుకుంటే, అందుకు తగ్గట్టుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మేము కూడా వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఒకవేళ KFC శాకాహార పదార్థాలు అమ్మితే ఆలయ పరిధిలో ఏర్పాటు ఎటువంటి అభ్యంతరం లేదు అని విశాల్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Kurnool: కూతురు బ్రెయిన్డెడ్.. దుఃఖాన్ని దిగమింగుతూ పలువురికి ప్రాణదానం