Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్రేప్ నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ నేలమట్టం..(వీడియో)
- నిందితుడైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్పై బుల్డోజర్
- వ్యాపార సముదాయాలు ఖాళీ చేయించి కూల్చేసిన అధికారులు
- కాంప్లెక్స్ కూల్చేందుకు మూడు బుల్డోజర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య అత్యాచారం కేసులో నిందితుడైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్పై బుల్డోజర్ చర్య ప్రారంభమైంది. ఈ కాంప్లెక్స్లో నడుస్తున్న బ్యాంక్ ను ఇంకో చోటుకు మార్చే వరకు అధికారులు వేచి ఉన్నారు. తాజాగా బ్యాంకు కార్యకలాపాలు మరో భవనంలోకి మార్చడమే కాకుండా.. వ్యాపార సముదాయం లోని ఇతర దుకాణాలు కూడా ఖాళీ చేశారు. దీంతో అధికారులు గురువారం దుకాణ సముదాయంపైకి మూడు బుల్డోజర్లను పంపారు. ఏకకాలంలో అక్రమ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఈ విషయంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
READ MORE: India Tour to England: భారత్-ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ విడుదల..
Also Read
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
ఈ మల్టీ కాంప్లెక్స్లో మూడింట ఒక వంతు భాగం చట్టవిరుద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ప్రభుత్వ బ్యాంకు కూడా ఉంది. అక్రమ భాగంలో నడుస్తున్న దుకాణాలపై పరిపాలన నోటీసులు అతికించిందని చెప్పారు. దీంతో ఇక్కడి నుంచి బ్యాంకు సహా దుకాణాలు వేరే చోటుకు తరలించారు. బుల్డోజర్ చర్యకు ముందే తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి ముందు మొయీద్ ఖాన్ బేకరీని కూడా బుల్డోజర్తో కూల్చివేశారు.
READ MORE:Kolkata doctor case: బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన.. న్యాయం చేయాలని డిమాండ్
అయితే.. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి ఎస్పీ సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “గత మార్చి నుంచి మొయీద్ అహ్మద్కు షాపింగ్ కాంప్లెక్స్ లపై నోటీసులు జారీ చేశాం. అయితే అతని అహంకారం కారణంగా నోటీసు తీసుకోలేదు. ఈ నిర్మాణం చట్ట విరుద్ధంగా కట్టినట్లు డెవలప్మెంట్ అథారిటీ మ్యాప్ను కూడా సమర్పించింది. చెరువు, గ్రామ సొసైటీ భూమిని ఆక్రమించి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని నోటీసులో పేర్కొన్నాం. నోటీసుకు స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నాం.” అని ఆయన తెలిపారు.
READ MORE:Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
అసలేంటి ఈ ఘటన…
కాగా… ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. మోయిద్ ఖాన్, అతని ఉద్యోగి రాజుఖాన్ మూడు నెలల క్రితం 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత రెండు నెలలు కూడా బాలికను లైంగికంగా వేధించారు. ఆమెను బెదిరించేందుకు లైంగిక దాడి సమయంలో తీసిన వీడియోలను ఉపయోగించారు. మోయిద్ ఖాన్కి రాజు ఖాన్ సాయం చేశాడు. మైనర్ గర్భవతి అని తేలడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. జూలై 30న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ సీఎం యోగి బాధితురాలి తల్లిని కలుసుకుని ఆమెకు న్యాయం చేస్తానమని హామీ ఇచ్చారు.
#WATCH | Ayodhya gang-rape incident | Police and administration carry out demolition drive at shopping complex owned by accused SP leader, for illegal construction. pic.twitter.com/r9TXr7Lidw
— ANI (@ANI) August 22, 2024
తాజావార్తలు
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!