Kolkata doctor case: బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన.. న్యాయం చేయాలని డిమాండ్
- కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీజేపీ నిరసన
- నాయకులు... కార్యకర్తలు భారీ ప్రదర్శన
- న్యాయం చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యురాలి హత్యాచార ఘటన ఇప్పటికే దేశాన్ని కుదిపేసింది. వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించిన రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలిపారు.
ఇది కూడా చదవండి: Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
వైద్యురాలి హత్యాచార ఘటనను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తోంది. గురువారం కేసు దర్యాప్తును న్యాయస్థానానికి సీబీఐ అందజేసింది. క్రైమ్ సీన్ను మార్చేసినట్లుగా కోర్టుకు తెలిపింది. ఇక బాధితురాలి దహనసంస్కారాలు పూర్తయ్యాక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చి.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కుప్పకూలుతున్న జనాలు
సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా ఉంటే.. ఆమెది అసహజ మరణం అని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అంతేగాక.. అసహజ మరణం అని నమోదు చేయడానికి ముందే పోస్ట్మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. శవపరీక్ష జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ను సీల్ చేశారెందుకు? అని కోర్టు ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: నయన్ ను ఇలా చూస్తే తట్టుకోలేరు సుమీ!!
#WATCH | West Bengal: BJP leaders and workers stage a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital in Kolkata. pic.twitter.com/fyaxmhMxrK
— ANI (@ANI) August 22, 2024
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!