AUS vs IND: నేనే రోహిత్ స్థానంలో ఉంటే.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- పెర్త్ వేదికగా మొదటి టెస్ట్
- సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. రోహిత్ తన సతీమణి రితికా సజ్దే ప్రసవం నేపథ్యంలో ముంబైలోనే ఉన్నాడు. రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. టీమిండియా కెప్టెన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బోర్డర్-గవాస్కర్ లాంటి ప్రతిష్టాత్మక సిరీస్లో జట్టుకు కెప్టెన్ అవసరం ఉంటుందని, రోహిత్ శర్మ త్వరగా ఆస్ట్రేలియా వెళ్లి తొలి టెస్టు ఆడితే బాగుంటుందని సౌరవ్ గంగూలీ అన్నారు. రెవ్ స్పోర్ట్స్తో దాదా మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ సతీమణి రితిక రెండో బిడ్డకు జన్మనిచ్చారు. హిట్మ్యాన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలొస్తున్నాయి. బోర్డర్-గవాస్కర్ లాంటి పెద్ద సిరీస్లో ఒక్క మ్యాచ్ను కూడా కెప్టెన్ వదిలేయకూడదు. టెస్ట్ సిరీస్కు ఇంకా వారం రోజుల సమయం ఉంది. రోహిత్ ఆస్ట్రేలియాకు త్వరగా వెళ్లాలి. అతడు పెర్త్ టెస్టు ఆడితే బాగుంటుంది. ఒకవేళ నేను రోహిత్ స్థానంలో ఉంటే.. కచ్చితంగా ఆసీస్ వెళ్లి ఆడేవాడిని. ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభానికి మంచి నాయకత్వం అవసరం. గతంలోరోహిత్ను టెస్టు కెప్టెన్సీ తీసుకోవాలని చాలాసార్లు మాట్లాడి ఒప్పించా. టెస్టులకు కెప్టెన్సీ చేయకుండా కెరీర్ ముగించవద్దని చెప్పా’ అని తెలిపారు.
Also Read
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే భారత్ను గాయాల బెడద వేధిస్తోంది. వార్మప్ మ్యాచ్, ప్రాక్టీస్ సందర్భంగా శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీలు గాయపడినట్లు వార్తలు వచ్చాయి. గిల్ తొలి టెస్టులో ఆడేది అనుమానంగానే మారింది. అతడి చేతి వేలు విరిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరి గిల్ స్థానంలో ఎవరు ఆడతారో చూడాలి. పెర్త్ టెస్టులో ధ్రువ్ జురెల్ ఆడటం ఖాయమని తెలుస్తోంది.
తాజావార్తలు
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!