AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం!
- న్యూజిలాండ్కు టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్
- నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా సిరీస్
- భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది.
న్యూజిలాండ్ సిరీస్లోని మొదటి టెస్టులో ఆడిన కేఎల్ రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో 12 రన్స్ చేశాడు. గిల్ అందుబాటులోకి రావడం, పేలవ ఫామ్ కారణంగా.. మిగితా రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024కి ఎంపికైన రాహుల్.. ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టనున్నాడు. నవంబర్ 7 నుంచి ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్.. 187 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాహుల్కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
Also Read: Virat Kohli Birthday: 2006లో చిన్న పిల్లాడు.. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం!
యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం జురెల్కు లేకపోవడంతో అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే ఆస్ట్రేలియాకు పంపిస్తోంది. జురెల్ కూడా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో ఆడనున్నాడని తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!