AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం!
- న్యూజిలాండ్కు టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్
- నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా సిరీస్
- భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది.
న్యూజిలాండ్ సిరీస్లోని మొదటి టెస్టులో ఆడిన కేఎల్ రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో 12 రన్స్ చేశాడు. గిల్ అందుబాటులోకి రావడం, పేలవ ఫామ్ కారణంగా.. మిగితా రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024కి ఎంపికైన రాహుల్.. ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టనున్నాడు. నవంబర్ 7 నుంచి ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్.. 187 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాహుల్కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read: Virat Kohli Birthday: 2006లో చిన్న పిల్లాడు.. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం!
యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం జురెల్కు లేకపోవడంతో అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే ఆస్ట్రేలియాకు పంపిస్తోంది. జురెల్ కూడా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో ఆడనున్నాడని తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!