AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకాలో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. వర్షం ప్రభావంతో డక్వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతి ప్రకారం నిర్ణయించిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియాపై తమ చరిత్రలోనే తొలి వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది బంగ్లాదేశ్.
మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్, కూపర్ కానోలీతో పాటు మ్యాట్ రెన్షా ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో ఆసీస్ 0 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ (34), అలెక్స్ క్యారీ (13) కూడా పెద్దగా రాణించలేకపోయారు. ఒక దశలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను మార్నస్ లబుషేన్ (55 నాటౌట్), జేవియర్ బార్ట్లెట్ (52) అర్ధశతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరి పోరాటంతో ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుత ప్రదర్శనతో 3 వికెట్లు పడగొట్టగా, టాస్కిన్ అహ్మద్ కూడా 3 వికెట్లు సాధించాడు. తన్వీర్ ఇస్లాం రెండు వికెట్లతో ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాడు.
Also Read
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు తొలి బంతికే తంజిద్ హసన్ వికెట్ కోల్పోయినా, సౌమ్య సర్కార్ (42), కెప్టెన్ నజ్ముల్ హొసేన్ శాంటో (41) జట్టును గాడిలో పెట్టారు. అనంతరం లిట్టన్ దాస్ (21), టౌహిద్ హృదోయ్ (40 నాటౌట్), మెహిదీ హసన్ మిరాజ్ (22 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొసేన్ శాంటో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై తొలి వన్డే సిరీస్ విజయం సాధించడం తమకు ఎంతో ప్రత్యేకమని తెలిపాడు. గత కొన్ని నెలలుగా జట్టు కష్టపడి పనిచేసిందని, ఆ కృషికి ఇప్పుడు ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ సమిష్టి ప్రదర్శననే విజయానికి కారణమని చెప్పాడు. చివరి వన్డేలో కూడా ఇదే జోష్ కొనసాగించి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ కొత్త బంతితో స్వింగ్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పాడు. సాధారణంగా పాత బంతితో బౌలింగ్ చేయడం ఇష్టమని, అయితే జట్టుకు అవసరమైన సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించానని పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు నొప్పులు సహజమేనని, ఫిట్నెస్ విషయంలో ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ మాట్లాడుతూ.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసిందని అంగీకరించాడు. లబుషేన్, బార్ట్లెట్ పోరాటంతో పోటీ స్కోరు సాధించినప్పటికీ అది సరిపోలేదని తెలిపాడు. సిరీస్లో ఇప్పటివరకు బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిందని ప్రశంసించాడు. చివరి మ్యాచ్లో తప్పిదాలను సరిదిద్దుకుని గెలుపుతో ముగించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
-
Jaishankar in Kyiv: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
-
OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..
-
Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!