CAA: నేడు సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్.. సీఎం హెచ్చరించిన పట్టించుకోని పార్టీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలుకు వ్యతికేరంగా ఇవాళ అస్సాం (Assam) లోని ప్రతిపక్ష కూటమి రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో సీఏఏను అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని 16 పార్టీల అస్సాం యునైటెడ్ అపోసిషన్ ఫోరమ్ (UOFA) వెల్లడించింది. దీని వల్ల అస్పామీస్ కమ్యూనిటీ విచ్చిన్నమయ్యే ఛాన్స్ ఉందన్నారు. తమ భాషను, సాహిత్యం, సంస్కృతి, గుర్తింపును కోల్పోతామని వారు స్పష్టం చేశారు.
Read Also: Mallikarjun Kharge: లోకసభ ఎన్నికలకు ఏఐసీసీ చీఫ్ దూరం?.. కారణం ఇదే..!
Also Read
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
- Virat Kohli: "ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు".. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
కాగా, ప్రతిపక్షాల బంద్ పిలుపుపై రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ఇలాంటి నిరసనలను గువాహటి హైకోర్టు గతేడాది మార్చిలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమని తెలిపారు. బంద్లు చట్టవ్యతిరేకమని, రాజ్యాంగానికి విరుద్ధమని హైకోర్టు చెప్పిందనే విషయాన్ని సీఎం స్పష్టం చేశారు. బంద్ చేసినట్లయితే ఆయా పార్టీల రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అవుతాయని ఆయన తేల్చి చెప్పారు. బంద్ సందర్భంగా జరిగే ఆర్థిక నష్టాన్ని నిరసనకారులు, వాటిని నిర్వహించే బాధ్యుల నుంచి వసూలు చేస్తామని అస్సాం సీఎం హెచ్చరించారు. అయినప్పటికీ సీఏఏ అమలుపై తాము వెనక్కి తగ్గేదిలేదని విపక్ష కూటమి వెల్లడించింది.
Read Also: Traffic Restrictions: నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..
అయితే, లోక్సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలను విడగొట్టడమే బీజేపీ పన్నాగం అని సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ విమర్శించారు. దీని వల్ల బెంగాల్, అస్సాం, త్రిపురలో ఓట్లు పొందొచ్చని బీజేపీ చూస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. కాగా, విపక్షాల బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను పోలీసులు మోహరించారు.
తాజావార్తలు
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!