India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 21 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్యకుమార్ నేతృత్వంలోనే జట్టు ఈ మ్యాచ్లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది.
ఆసియా కప్ 2025ఓ భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అభిమానులు పెద్దగా స్టేడియంకు రాకపోయినా.. ఒకరు మాత్రం మైదానంలో సందడి చేశారు. భారత జెండా పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాను ఉత్సాహపరుస్తూ కెమెరాల్లో కనిపించారు. దాంతో క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారారు. ఆమె అఫ్గానిస్థాన్కు చెందిన వజ్మా ఆయుబి. 28 ఏళ్ల వజ్మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా. 2022 ఆసియా…