Asia Cup 2025: సూపర్-4 జట్లు ఖరారు.. భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి సంగ్రామం!
- ఆసియా కప్ 2025 సూపర్-4 ఖరారు!
- మళ్లీ తలపడనున్న భారత్, పాకిస్థాన్..
- సూపర్-4 జట్లు: భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్
- సెప్టెంబర్ 21న భారత్, పాకిస్థాన్ వోల్టేజ్ మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్లో సూపర్-4 దశకు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు స్థానం సంపాదించగా.. తాజాగా గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్-B చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4లోకి ప్రవేశించింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచే ఉంటే బంగ్లాదేశ్ నిష్క్రమించాల్సి వచ్చేది. అయితే శ్రీలంక అలా జరగనివ్వలేదు.
India vs Oman: నేడు ఒమన్తో భారత్ ఢీ.. రెండు మార్పులు తప్పవా? తుది జట్లు ఇవే
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ఈ గ్రూప్ Bలో శ్రీలంక మూడు మ్యాచ్ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ రెండు విజయాలతో 4 పాయింట్లతో రెండో స్థానంలో ముగించింది. ఒకే ఒక్క విజయంతో ఆఫ్ఘనిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. హాంగ్కాంగ్ మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోగా చివరన నిలిచింది. ఇక గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ ముందుగానే సూపర్-4లోకి వచ్చాయి. భారత్ నేడు (19 సెప్టెంబర్)న ఓమాన్తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే అంతకుముందే పాకిస్తాన్, UAEపై విజయాలు సాధించి సూపర్-4లోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్ కూడా ఓమాన్, UAEపై గెలిచి అర్హత పొందింది. UAE ఒక్క మ్యాచ్ గెలిచి మూడో స్థానంలో నిలవగా, ఓమాన్ ఒక్క విజయమూ సాధించలేక చివరి స్థానంలో నిలిచింది.
Chemical Factory Blast: కెమికల్ కంపెనీలో భారీ బ్లాస్ట్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!
దీనితో ఇక సూపర్-4లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య హోరాహోరీ మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి ఆసియా కప్ సూపర్ ఫోర్స్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20న దుబాయ్లో జరిగే 13వ మ్యాచ్లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడతాయి. తరువాతి రోజు, సెప్టెంబర్ 21న అదే వేదికలో జరిగే 14వ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ పోరు జరుగుతుంది. సెప్టెంబర్ 23న అబుదాబిలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే, సెప్టెంబర్ 24న దుబాయ్లో బంగ్లాదేశ్, భారత్ జట్లు తలపడతాయి. సెప్టెంబర్ 25న మళ్లీ దుబాయ్లోనే బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల మధ్య 17వ మ్యాచ్ ఉంటుంది. చివరిగా, సెప్టెంబర్ 26న దుబాయ్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వీటిలో టాప్ 2 దేశాలు సెప్టెంబర్ 28న ఫైనల్ ఆడనున్నాయి.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!