Asaduddin Owaisi: ఇలా ఎఫ్ఐఆర్ చూడటం ఇదే తొలిసారి.. తనపై నమోదైన కేసుపై ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, వివాదాస్పద సాధువు యతి నరసింహానందపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలను చూసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీసుల గురించి అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. తనపై నమోదైన కేసు ఏమిటో తెలపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎఫ్ఐఆర్ ను చూడటం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి నేను భయపడనని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాన్ని విమర్శించడాన్ని, విద్వేషపూరిత వ్యాఖ్యలుగా చూడలేమని ఆయన అన్నారు.
Also Read
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వంటి వారిపై కేసులు కొనసాగించే ధైర్యం లేనట్లు కనిపిస్తోందని.. ఇందుకు పోలీసుల ఆలస్యంగా స్పందించమే కారణం ట్వీట్ చేశారు. ముస్లింలపై మారణహోమాన్ని ప్రోత్సహించడం, ఇస్లాంను కించపరచడం ద్వారా యతి నరసింహానంద బెయిల్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలకు అలవాటు పడ్డారని.. అంతర్జాతీయ సమాజం ఖండించినప్పుడు మాత్రమే కోర్టులు, పోలీసులు నామమాత్రమైన చర్యలు తీసుకుంటున్నారని అసదుద్దీన్ ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు ‘ బ్యాలెన్సుడ్ వాద్’ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని.. హిందూ మతోన్మాదులను నొప్పించకుండా ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారంటూ విమర్శించారు. ఒక పక్క మహ్మద్ ప్రవక్తను అవమానిస్తూనే.. మరోవైపు బీజేపీ మద్దతుదారులను ఒప్పించేందుకు నాపై కేసు పెట్టారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. దీనికి విరుద్ధంగా, ముస్లిం విద్యార్థులు, జర్నలిస్టులు, కార్యకర్తలు కేవలం ముస్లిం అనే నేరానికి జైలులో పెట్టారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!