Asaduddin Owaisi: ఇలా ఎఫ్ఐఆర్ చూడటం ఇదే తొలిసారి.. తనపై నమోదైన కేసుపై ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, వివాదాస్పద సాధువు యతి నరసింహానందపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలను చూసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీసుల గురించి అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. తనపై నమోదైన కేసు ఏమిటో తెలపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎఫ్ఐఆర్ ను చూడటం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి నేను భయపడనని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాన్ని విమర్శించడాన్ని, విద్వేషపూరిత వ్యాఖ్యలుగా చూడలేమని ఆయన అన్నారు.
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వంటి వారిపై కేసులు కొనసాగించే ధైర్యం లేనట్లు కనిపిస్తోందని.. ఇందుకు పోలీసుల ఆలస్యంగా స్పందించమే కారణం ట్వీట్ చేశారు. ముస్లింలపై మారణహోమాన్ని ప్రోత్సహించడం, ఇస్లాంను కించపరచడం ద్వారా యతి నరసింహానంద బెయిల్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలకు అలవాటు పడ్డారని.. అంతర్జాతీయ సమాజం ఖండించినప్పుడు మాత్రమే కోర్టులు, పోలీసులు నామమాత్రమైన చర్యలు తీసుకుంటున్నారని అసదుద్దీన్ ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు ‘ బ్యాలెన్సుడ్ వాద్’ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని.. హిందూ మతోన్మాదులను నొప్పించకుండా ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారంటూ విమర్శించారు. ఒక పక్క మహ్మద్ ప్రవక్తను అవమానిస్తూనే.. మరోవైపు బీజేపీ మద్దతుదారులను ఒప్పించేందుకు నాపై కేసు పెట్టారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. దీనికి విరుద్ధంగా, ముస్లిం విద్యార్థులు, జర్నలిస్టులు, కార్యకర్తలు కేవలం ముస్లిం అనే నేరానికి జైలులో పెట్టారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?