Uttar Pradesh: ప్రాంక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రాంక్ చేయబోయి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటూ మెడకు ఉచ్చుబిగుసుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఓరై ప్రాంతంలోని కాన్షీరాం కాలనీలో ఓ బాలుడు తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాన్షీరాం కాలనీ పోలీసు ఔట్పోస్టు ఇన్చార్జి మహ్మద్ ఆరీఫ్ దీని గురించి వివరిస్తూ 13 ఏళ్ల బాలుడు ప్రాంక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాడు.
Also Read: Success Story: అప్పుడు దేశానికి సేవ చేశాడు.. ఇప్పుడు వ్యవసాయం చేసి పదిమంది కడుపు నింపుతున్నాడు
Also Read
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
తన చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో తన కళ్లకు గుడ్డ కట్టుకొని, ఆపై మెడకు తాడుతో ఉచ్చు బిగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తరువాత ఆ తాడును ఓ కిటికీకి కట్టి ఓ టేబుల్ పై కూర్చున్నట్లు పోలీసులు వివరించారు. అయితే ఆడుకునే సమయంలో ఆ టేబుల్ ఎవరో నెట్టారని దాంతో బాలుడి మెడకు ఉచ్చు బిగుసుకొని అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న బాలుడు చనిపోవడంతో చుట్టుపక్కల విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ఘటనలో చనిపోయిన బాలుడి తల్లి అంధురాలు. అందుకే బాలుడు ప్రమాదంలో ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేకపోయింది. ఇదే విషయాన్ని స్థానికుల వద్ద చెబుతూ ఆమె కన్నీరు మున్నీరు అయినట్లు తెలుస్తోంది. తనకే కనుక కళ్లు ఉండి ఉంటే తన బిడ్డను కాపాడుకోగలిగేదానినని తాను అంధురాలిని అవడం వల్లే తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరు అయినట్లు తెలుస్తోంది. అందుకే పిల్లలకు అన్ని విషయాలు తెలిసే దాకా, ప్రపంచం గురించి అవగాహన వచ్చే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఎంతో అవసరం.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!