IPL2023 : కేకేఆర్ కు వరుస షాక్ లు.. టోర్నీ నుంచి కీలక ప్లేయర్స్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకో పదిరోజుల్లో ఐపీఎల్-16 సీజన్ మొదలుకోబోతున్న నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి గాయం కారణంగా వచ్చే సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉండగా తాజాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తో పాటు మరో బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నారు.
Also Read : Expressway: సీఎం గారు.. నా కారు మీరే బాగుచేయించాలి
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
కేకేఆర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బంగ్లా ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెష్ ఇవ్వలేదు.. ప్రస్తుతం బంగ్లాదేశ్.. స్వదేశంలో ఐర్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆడుతోంది. ఐర్లాండ్-బంగ్లాదేశ్ ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లలో షకిబ్ తో పాటు లిట్ దాస్ కూడా ఉన్నాడు. ఏప్రిల్ 9 నాటికి ఐర్లాండ్-బంగ్లాదేశ్ ల మధ్య సిరీస్ లు ముగిస్తాయి. అప్పటికే ఐపీఎల్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ లు ముగిసేదాకా బంగ్లాదేశ్.. షకిబ్, దాస్ లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం అనుమానమేనని తెలుస్తోంది.
Also Read : Mahesh Babu: ఈయన అన్నం తింటున్నాడా లేక అందం తింటున్నాడా?
ఇప్పటికే వెన్ను నొప్పి గాయం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడని.. లేకుంటే కనీసం ఫస్టాఫ్ వరకైనా దూరం కానున్నాడని వార్తులు వినిపిస్తున్నాయి. దీంతో అనుభవం ఉన్న షకిబ్ అల్ హసన్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పుతారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హసన్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నాడని తెలియడంతో కేకేఆర్ అభిమానులు షాక్ లో ఉన్నారు.
Also Read : Weather : తెలంగాణలో భారీ వర్షాలు.. తడిసిన మహానగరం!
అయ్యర్ తో పాటు షకిబ్ కూడా దూరం కావడంతో మరి కేకేఆర్ నెక్ట్స్ కెప్టెన్ ఎవరు..? అనే ప్రశ్నకు ఆ జట్టును వేధిస్తుంది. మూడు రోజుల క్రితం ఆ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ను కేకేఆర్ సారథిగా నియమించనుందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ మేరకు కేకేఆర్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఓ ప్యాన్ పోస్టుకు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని తెలిపిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. తాజా పరిణామాలతో కేకేఆర్ అసలు కెప్టెన్ గా ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?