Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Arvind Kejriwals Personal Secretary Bibhav Kumar Sacked By Vigilance Department Heres Why

Kejriwal: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ‌పై వేటు.. కారణమిదే..!

Published Date :April 11, 2024 , 9:13 am
By Suresh Maddala
Kejriwal: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ‌పై వేటు.. కారణమిదే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌‌పై వేటు పడింది. ఆయన్ను విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ తొలగించింది. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి సంబంధించిన కేసు కారణంగా బిభవ్‌కుమార్‌ను డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ తొలగించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిభవ్ కుమార్‌‌ను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అతనితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ను కూడా వేర్వేరుగా ఈడీ విచారించింది.

ఇది కూడా చదవండి: Sanju Samson: ఓటమి తర్వాత.. అందుకు కారణాలు చెప్పడం చాలా కష్టం: సంజూ

2011లో అవినీతికి వ్యతికేరంగా చేపట్టిన ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో బిభవ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. యూపీఏ హయాంలో వెలుగులోకి వచ్చిన అవినీతి కుంభకోణాలపై బిభవ్ పోరాటం చేశారు. అనంతరం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. పర్సనల్ సెక్రటరీగా బిభివ్‌ను కేజ్రీవాల్ నియమించకున్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. మార్చి 21న ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: Chandrababu and Pawan Kalyan: చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం.. నేడు అమలాపురంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

అనంతరం ఈడీ అరెస్ట్‌పై హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్‌ చెప్పారని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్‌ అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని.. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలను కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సుప్రీంకోర్టు కూడా విచారణకు మరొక తేదీని ఇస్తామని పెండింగ్‌లో పెట్టింది.

ఇది కూడా చదవండి: Pakistan: పాక్‌ సైన్యం దురాగతాలు.. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి..!

ఇక బుధవారం సునీతా కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్, ఆప్ సభ్యులు సందీప్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్‌లతో సహా ప్రముఖ ఆప్ నేతలు కలిశారు. నియంత ప్రభుత్వం యొక్క అన్ని దురాగతాలను భరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని సునీతా కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించారు.

ఇది కూడా చదవండి: Summer Tips : వేసవిలో ఈ పానీయాలను తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arvind Kejriwal
  • Bibhav kumar
  • Delhi liquor case
  • ED
  • Personal secretary

తాజావార్తలు

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

  • Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions