ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.