Arvind Kejriwal: డర్టీ పాలిటిక్స్.. మనీష్ సిసోడియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా అరెస్ట్పై స్పందిస్తూ ‘డర్టీ పాలిటిక్స్’ అని మండిపడ్డారు. ఈ దుష్ట రాజకీయాలకు ప్రజలు సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఢిల్లీ ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది.
“మనీష్ నిర్దోషి. అతని అరెస్టు నీచ రాజకీయం. సిసోడియా అరెస్ట్ కారణంగా ప్రజల్లో చాలా కోపం ఉంది. అందరూ చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ప్రజలు దీనికి స్పందిస్తారు. ఇది మా స్ఫూర్తిని మరింత పెంచుతుంది. మా పోరాటం మరింత బలపడుతుంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “ప్రతి పేద ఇంటి నుండి పిల్లలు బడికి వెళ్లేలా మనీష్ సిసోడియా చాలా కష్టపడ్డాడు. అతను నిజాయితీపరుడు, మర్యాదగల వ్యక్తి. కానీ వారు ఈ రోజు అతన్ని అరెస్టు చేశారు. మంచి వ్యక్తులను, దేశభక్తులను అరెస్టు చేశారు, వారి స్నేహితులు బ్యాంకుల నుంచి లక్షలాది దోచుకుంటున్నారు.” కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
Read Also: Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
ఢిల్లీ కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో మనీష్ సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని అనుసరించి, కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ నిందించింది. సిసోడియా ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం విక్రయ విధానానికి తిరిగి వెళ్లిందని బీజేపీ పేర్కొంది. సిసోడియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ ఈరోజు పేర్కొంది.
అయితే కేజ్రీవాల్, సిసోడియా ఎదుగుదలకు బీజేపీ భయపడుతోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి అన్నారు. “ఆప్కి పెరుగుతున్న ప్రజాదరణ ఈ అరెస్టు వెనుక కారణం. బిజెపి ఆప్ను అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. కేసు తప్పుడుది” అని అతిషి ఈ రోజు ఢిల్లీలో విలేకరులతో అన్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!