Rajahmundry: గోదావరిలో కార్తీక స్నానాలు.. ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry: కార్తీక మాసం వచ్చేసింది.. ఇక, దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.. అయితే, భక్తుల సౌకర్యార్థం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాజమండ్రి గోదావరి నది చెంతన ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ భరత్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కాదు. దేశంలోనే అతి పెద్ద ఘాట్ గా కోటిలింగాల ఘాట్ కు పేరుందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర, పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ ఘాట్ లో కార్తీక పుణ్య స్నానాలు చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారని చెప్పారు.
ఇక, ఈ ఘాట్ చెంతనే శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయం కూడా ఉండటంతో పరమ శివునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసంలో కోటిలింగాల ఘాట్ లో భక్తులు ఎంతో పవిత్రంగా స్నానాలు ఆచరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారన్నారని తెలిపారు ఎంపీ భరత్.. అంతటి విశిష్టమైన ఈ ఘాట్, ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ పాలకమండలి ఛైర్మన్ అరిగెల బాబు నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో పూర్తి చేశారన్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారన్నారు. పిల్లలు, వృద్ధులు గోదావరి నదిలోకి దిగకుండా గట్టుపైనే ప్రత్యేక ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా ఏర్పాటు చేసినట్టు ఎంపీ వివరించారు. కోటిలింగాల ఘాట్ సమీపంలోగల నదిలో బంకమట్టి తొలగించి ఇసుక వేయడం జరిగిందన్నారు. అలాగే గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఆపదా రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా రోప్స్ కట్టడం, అలాగే రెండు బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
కార్తీక మాస ఆరంభం మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భక్తులు స్నానాలకు వచ్చే అవకాశం ఉండటంతో ఫ్లడ్ లైట్లు, ఆర్టిఫిషియల్ షవర్స్ స్టార్ట్ అవుతాయన్నారు. తెల్లవార్లూ లైట్లు వెలుగుతూనే ఉంటాయన్నారు. ఇదే విధంగా పుష్కర్ ఘాట్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు ఆర్ఎంసీ చేపట్టిందన్నారు ఎంపీ భరత్.. ఇక, ఘాట్ల పరిశీలన అనంతరం పుష్కర్ ఘాట్ సమీపంలో గల చిత్రాంగి అతిథి గృహాన్ని ఎంపీ భరత్ పరిశీలించారు. ఇక్కడ రాత్రి సమయాల్లో మద్యం బాబులు, ఆకతాయిల ఆగడాలు ఎక్కువుగా ఉంటున్నాయని పలువురు ఎంపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మద్యం సీసాలు, సిగరెట్లు, నిరోధ్ ప్యాకెట్లు, పేక ముక్కలు ఉండటంతో వెంటనే మున్సిపల్, పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠినమైన, పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. అలాగే నగర వాసులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలని సూచించారు రాజమండ్రి ఎంపీ భరత్.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!