Rajahmundry: గోదావరిలో కార్తీక స్నానాలు.. ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry: కార్తీక మాసం వచ్చేసింది.. ఇక, దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.. అయితే, భక్తుల సౌకర్యార్థం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాజమండ్రి గోదావరి నది చెంతన ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ భరత్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కాదు. దేశంలోనే అతి పెద్ద ఘాట్ గా కోటిలింగాల ఘాట్ కు పేరుందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర, పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ ఘాట్ లో కార్తీక పుణ్య స్నానాలు చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారని చెప్పారు.
ఇక, ఈ ఘాట్ చెంతనే శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయం కూడా ఉండటంతో పరమ శివునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసంలో కోటిలింగాల ఘాట్ లో భక్తులు ఎంతో పవిత్రంగా స్నానాలు ఆచరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారన్నారని తెలిపారు ఎంపీ భరత్.. అంతటి విశిష్టమైన ఈ ఘాట్, ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ పాలకమండలి ఛైర్మన్ అరిగెల బాబు నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో పూర్తి చేశారన్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారన్నారు. పిల్లలు, వృద్ధులు గోదావరి నదిలోకి దిగకుండా గట్టుపైనే ప్రత్యేక ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా ఏర్పాటు చేసినట్టు ఎంపీ వివరించారు. కోటిలింగాల ఘాట్ సమీపంలోగల నదిలో బంకమట్టి తొలగించి ఇసుక వేయడం జరిగిందన్నారు. అలాగే గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఆపదా రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా రోప్స్ కట్టడం, అలాగే రెండు బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
కార్తీక మాస ఆరంభం మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భక్తులు స్నానాలకు వచ్చే అవకాశం ఉండటంతో ఫ్లడ్ లైట్లు, ఆర్టిఫిషియల్ షవర్స్ స్టార్ట్ అవుతాయన్నారు. తెల్లవార్లూ లైట్లు వెలుగుతూనే ఉంటాయన్నారు. ఇదే విధంగా పుష్కర్ ఘాట్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు ఆర్ఎంసీ చేపట్టిందన్నారు ఎంపీ భరత్.. ఇక, ఘాట్ల పరిశీలన అనంతరం పుష్కర్ ఘాట్ సమీపంలో గల చిత్రాంగి అతిథి గృహాన్ని ఎంపీ భరత్ పరిశీలించారు. ఇక్కడ రాత్రి సమయాల్లో మద్యం బాబులు, ఆకతాయిల ఆగడాలు ఎక్కువుగా ఉంటున్నాయని పలువురు ఎంపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మద్యం సీసాలు, సిగరెట్లు, నిరోధ్ ప్యాకెట్లు, పేక ముక్కలు ఉండటంతో వెంటనే మున్సిపల్, పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠినమైన, పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. అలాగే నగర వాసులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలని సూచించారు రాజమండ్రి ఎంపీ భరత్.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!