IPhone 5G Update: డిసెంబర్ నాటికి అన్ని ఐఫోన్ మోడళ్లలో 5జీ సాఫ్ట్వేర్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPhone 5G Update: దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు, టెలికాం నెట్వర్క్ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్, శాంసంగ్, వివో, షియోమీ వంటి మొబైల్ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్వేర్ అప్డేట్లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనున్నారు. దేశంలో 5జీ సేవలు ప్రారంభమైనప్పటికీ.. 5జీ సేవలకు అనువైన సాఫ్ట్వేర్ను డిసెంబర్ నాటికి అప్డేట్ చేస్తామని యాపిల్ తెలిపింది. డిసెంబరు నాటికి ఐఫోన్ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన అన్ని 5జీ మోడళ్లకు సాఫ్ట్వేర్ అప్డేషన్ అందిస్తామని మంగళవారం తెలిపింది. 5జీ సేవల నాణ్యత, పనితీరుపై జరుగుతున్న ప్రయోగ పరీక్షలు సఫలమైన వెంటనే అప్డేట్ అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్లతో పాటు ఐఫోన్ ఎస్ఈ (3వ తరం) ఫోన్లు 5జీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటిని ఎయిర్టెల్, జియో 5జీ నెట్వర్క్లపై యాపిల్ పరీక్షిస్తోంది.
NASA: దారి మళ్లిన గ్రహశకలం.. నాసా డార్ట్ ప్రయోగం సక్సెస్
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
రిలయన్స్ జియో 4 నగరాల్లో ప్రయోగాత్మక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించగా.. భారతీ ఎయిర్టెల్ 8 నగరాల్లో వాణిజ్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపాయి. వచ్చే ఏడాది కల్లా ఈ సేవలను గణనీయంగా విస్తరిస్తామని ప్రకటించాయి. దేశంలో 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఇప్పటికే ‘5జీ రెడీ’ అని ప్రకటితమైన స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. యాపిల్ తాజా ఆవిష్కరణ అయిన ఐఫోన్ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన 5జీ మోడళ్లు, శాంసంగ్కు చెందిన పలు ప్రీమియం స్మార్ట్ఫోన్లు కూడా దేశంలో 5జీ సేవలకు అనువైన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికాం విభాగ కార్యాలయంలో బుధవారం అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్, శాంసంగ్, వివో, షియోమీ వంటి మొబైల్ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్వేర్ అప్డేట్లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనున్నారు.
- Tags
- 5g services
- Airtel
- Apple
- december
- india
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!