AP Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. నా నోటికి ప్లాస్టర్ వేశారు..!
- శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
- నా వృద్ధి అంతా నా నియోజకవర్గ ప్రజల భిక్షగా పేర్కొన్న అయ్యన్న..
- చంద్రబాబు నాయుడు నా నోటికి ప్లాస్టర్ వేశారు..!
- రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టారన్న స్పీకర్..
- చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు.. భాధ్యతగా అభివర్ణన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడుకు సన్మాన సభ నిర్వహించారు.. ఇక, ఈ కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడుతూ.. నా వృద్ధి అంతా నా నియోజకవర్గ ప్రజల భిక్షగా పేర్కొన్నారు.. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా నోటికి ప్లాస్టర్ వేశారు.. రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టారని చమత్కరించారు.. కానీ, చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు.. భాధ్యతగా అభివర్ణించారు. ఐదేళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు.
Read Also: Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్
Also Read
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ఇక, ఏ పోలీసులైతే గోడ దూకి ఇబ్బంది పెట్టారో.. వారే ఈ రోజు సెల్యూట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు అయ్యన్నపాత్రుడు.. స్థానిక ఎంపీ రమేష్ సహకారంతో జిల్లాలో రెండు, మూడు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.. మా మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) పార్టీల నాయకులంతా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా వెనుకబడింది.. ఆ లోటును పూడ్చుకుని, మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమయంలో తప్పించి, మిగిలిన సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. నాతో పాటు నా కుమారులు విజయ్, రాజేష్ లు, పార్టీ నాయకులు మీ సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్న ఆయన.. గత ఎన్నికల్లో నాతో పాటు మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు అంటూ గుర్తుచేసుకున్నారు. ఇక, జులై ఒకటి నుంచి పింఛన్ల పంపిణీలో పార్టీ నాయకులు భాగస్వామ్యం వహించాలని సూచించారు.. ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!