AP Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. నా నోటికి ప్లాస్టర్ వేశారు..!
- శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
- నా వృద్ధి అంతా నా నియోజకవర్గ ప్రజల భిక్షగా పేర్కొన్న అయ్యన్న..
- చంద్రబాబు నాయుడు నా నోటికి ప్లాస్టర్ వేశారు..!
- రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టారన్న స్పీకర్..
- చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు.. భాధ్యతగా అభివర్ణన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడుకు సన్మాన సభ నిర్వహించారు.. ఇక, ఈ కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడుతూ.. నా వృద్ధి అంతా నా నియోజకవర్గ ప్రజల భిక్షగా పేర్కొన్నారు.. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా నోటికి ప్లాస్టర్ వేశారు.. రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టారని చమత్కరించారు.. కానీ, చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు.. భాధ్యతగా అభివర్ణించారు. ఐదేళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు.
Read Also: Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ఇక, ఏ పోలీసులైతే గోడ దూకి ఇబ్బంది పెట్టారో.. వారే ఈ రోజు సెల్యూట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు అయ్యన్నపాత్రుడు.. స్థానిక ఎంపీ రమేష్ సహకారంతో జిల్లాలో రెండు, మూడు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.. మా మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) పార్టీల నాయకులంతా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా వెనుకబడింది.. ఆ లోటును పూడ్చుకుని, మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమయంలో తప్పించి, మిగిలిన సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. నాతో పాటు నా కుమారులు విజయ్, రాజేష్ లు, పార్టీ నాయకులు మీ సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్న ఆయన.. గత ఎన్నికల్లో నాతో పాటు మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు అంటూ గుర్తుచేసుకున్నారు. ఇక, జులై ఒకటి నుంచి పింఛన్ల పంపిణీలో పార్టీ నాయకులు భాగస్వామ్యం వహించాలని సూచించారు.. ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..