AP Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. నా నోటికి ప్లాస్టర్ వేశారు..!
- శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
- నా వృద్ధి అంతా నా నియోజకవర్గ ప్రజల భిక్షగా పేర్కొన్న అయ్యన్న..
- చంద్రబాబు నాయుడు నా నోటికి ప్లాస్టర్ వేశారు..!
- రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టారన్న స్పీకర్..
- చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు.. భాధ్యతగా అభివర్ణన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడుకు సన్మాన సభ నిర్వహించారు.. ఇక, ఈ కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడుతూ.. నా వృద్ధి అంతా నా నియోజకవర్గ ప్రజల భిక్షగా పేర్కొన్నారు.. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా నోటికి ప్లాస్టర్ వేశారు.. రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టారని చమత్కరించారు.. కానీ, చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు.. భాధ్యతగా అభివర్ణించారు. ఐదేళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు.
Read Also: Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ఇక, ఏ పోలీసులైతే గోడ దూకి ఇబ్బంది పెట్టారో.. వారే ఈ రోజు సెల్యూట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు అయ్యన్నపాత్రుడు.. స్థానిక ఎంపీ రమేష్ సహకారంతో జిల్లాలో రెండు, మూడు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.. మా మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) పార్టీల నాయకులంతా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా వెనుకబడింది.. ఆ లోటును పూడ్చుకుని, మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమయంలో తప్పించి, మిగిలిన సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. నాతో పాటు నా కుమారులు విజయ్, రాజేష్ లు, పార్టీ నాయకులు మీ సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్న ఆయన.. గత ఎన్నికల్లో నాతో పాటు మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు అంటూ గుర్తుచేసుకున్నారు. ఇక, జులై ఒకటి నుంచి పింఛన్ల పంపిణీలో పార్టీ నాయకులు భాగస్వామ్యం వహించాలని సూచించారు.. ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!