Kakani Govardhan Reddy: సీఎం చెప్పిన మాట ప్రకారం.. సీజన్కు ముందే గిట్టుబాటు ధర: మంత్రి కాకాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agriculture Support Price Poster Released By AP Minister Kakani: వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్ను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సహా పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం.. సీజన్కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన చేశామని చెప్పారు.
వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్ను విడుదల చేసిన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘సీఎం చెప్పిన మాట ప్రకారం ఈ వ్యవసాయ సీజన్కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన చేశాం. దళారిల బెడద లేకుండా ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రాప్లో నమోదు చేసిన ప్రతి పంటకు మద్దతు ధరలు ఉంటాయి. వ్యాపారస్తులు ప్రభుత్వం ప్రకటించిన ఈ రేటు కంటే తక్కువగా కొనుగోలుకు ప్రయత్నిస్తే జోక్యం చేసుకుంటాం. ఏపీ ఎమ్ఎస్పీ యాక్ట్ తీసుకుని వస్తాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
Also Read: Tirumala Brahmotsavam 2023: ముగింపు దశకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం!
‘ఈరోజు క్యాంపు కార్యాలయంలో గడప గడపపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఇదే చివరి సమావేశం. ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళే తేలిపోతుంది అన్నది ప్రచారం మాత్రమే. గడప గడపపై ఎప్పటిలానే జరుగుతున్న సమీక్ష లాంటిదే ఇది. ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం దృష్టి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మీడియానే ఈ సమావేశానికి ప్రాధాన్యత కల్పించింది. ఎమ్మెల్యేలు, నేతలు అందరూ ప్రతి గడపకు వెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని సీఎం ఎప్పుడూ చెబుతారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్లాలనే అంశంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు’ అని మంత్రి కాకాణి చెప్పారు.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..