Minister Dharmana Prasada Rao: వెనుకబడిన వర్గాలకు స్వేచ్ఛ వచ్చింది.. ఎవ్వరి ప్రమేయం లేకుండా అందరికీ పథకాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dharmana Prasada Rao: తమ ప్రభుత్వంలోనే వెనుకబడిన వర్గాలకు స్వేచ్ఛ వచ్చింది.. ఎవ్వరి ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. సుమారు అయిదున్నార సంవత్సరాలక్రితం జగన్ తోకలిసి వచ్చాం.. అప్పటి ప్రభుత్వం చేస్తున్నా అవినీతి పై అందరకీ వివరించాం.. ప్రజల ఆమోదంతో ప్రభుత్వాలు ఏర్పాడతాయి అన్నారు. 75 ఏళ్ల తర్వాత ఎలాంటి మార్పలు చోటు చేసుకున్నాయో మీకు చెప్పాలి.. అధికారం కోసం పోరాటం చెయ్యకుండానే వైసీపీకి అధికారం వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం ఉన్న వెనుకబడిన వారు మరే ప్రభుత్వంలో లేరు.. గతంలో అధికార పార్టీకి మడుగులొత్తే సంస్కృతి దేశం అంతటా ఉండేది.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని హింసించే సందర్భాలు ఉండేవి.. కానీ, ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది.. తన వాడు సర్పంచిగానో, ఎమ్మెల్యే గానో.. ఇంటి మీద జెండాను ఉండాల్సిన అవసరం లేకుండా పథకాలు ఇస్తోందన్నారు. ఇది రాజ్యాంగ చెప్పి విధానంగా అభివర్ణించారు.
Read Also: ISIS: సిరియాలో ఐసిస్ మారణహోమం.. 30 మంది ప్రభుత్వ అనుకూల బలగాల హతం..
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
చంద్రబాబు ఎన్నో సమావేశాలలో మాట్లాడారు.. ఒక్క కులానికో, వర్గానికో, లంచం తీసుకోకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారాన్ని ఎప్పుడైనా చెప్పగలిగారా..? అని ప్రశ్నించారు ధర్మాన.. అత్యల్ప వెనుకబడిన వర్గాలకు ఈనాడు స్వేచ్ఛ వచ్చింది.. అన్ని పథకాలూ అందరికీ ఎవ్వరి ప్రమేయం లేకుండా అందుతున్నాయన్నారు. 12 వేల 8 వంద కోట్ల రూపాయల వెచ్చించి పేదవాడికి ఇళ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం.. ఏనాడూ గత ప్రభుత్వాలు చేయలేకపోయారే.. డబ్బులు పంచేస్తున్నారని చెప్పారు.. ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం వచ్చాక తీసేస్తామని చంద్రబాబు చెప్పారని.. మళ్లీ మొన్న రాజమండ్రి సభకు వచ్చేసరికి సర్దుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నాడు.. మహిళల రుణమాఫీ చేస్తామని.. ఇప్పుడు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.. మరి గత ఐదేళ్లలో ఏం చేశావు చంద్రబాబు అని నిలదీశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!