ISIS: సిరియాలో ఐసిస్ మారణహోమం.. 30 మంది ప్రభుత్వ అనుకూల బలగాల హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS: సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడుల్లో 30 మంది ప్రభుత్వ అనుకూల సైనికులు మరణించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి. ‘‘బుధవారం సిరియాలోని చెక్ పోస్టులు, సైనిక స్థావరాలపై ఐసిస్ ఉగ్రవాదులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో 30 మంది మరణించారు. వీరిలో నలుగురు సైనికులు ఉండగా.. 26 మంది నేషనల్ డిఫెన్స్ ఫోర్సుకు చెందిన వ్యక్తులు ఉన్నారు’’ అని బ్రిటన్ లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమర్ రైట్స్ తెలిపింది.
రాఖా, హోమ్స్, డీర్ ఎజోర్ మధ్య ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయి. అయితే క్షతగాత్రుల సంఖ్య పేర్కొనలేదు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. రష్యా యుద్ధ విమానాలు ఎడారిలోని ఐసిస్ స్థావరాలపై దాడి చేశాయని, జీహాదీలకు కూడా ప్రాణనష్టం జరిగినట్లు సిరియన్ అజ్జర్వేటరీ తెలిపింది.
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
Read Also: Parliament’s Winter session: డిసెంబర్ రెండో వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..?
2014 జూన్ నెలలో సిరియా, ఇరాక్ కలిపి ‘కాలిఫేట్’ ఏర్పాటు చేసినట్లుగా ఐసిస్ ప్రకటించింది. అయితే 2019లో ప్రభుత్వ బలగాలు ఐసిస్ ని నేలకూల్చి వారి ఆక్రమణలో ఉన్న ప్రదేశాలను తిరిగి తీసుకుంది. అప్పటి నుంచి ప్రభుత్వ అనుకూల దళాలతో పాటు కుర్దిష్ ఫైటర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఐసిస్ దాడులకు తెగబడుతోంది. ఆగస్టు నెలలో ఇలాగే డీర్ ఎజోర్ ప్రావిన్సులో మయాదీన్ సమీపంలో బస్సుపై మెరుపుదాడి చేయడంతో 33 మంది సిరియన్ సైనికులు మరణించారు. రెండు రోజుల క్రితం రఖాలోని ఐసిస్ దాడులు వల్ల 10 మంది మరణించారు.
ఆగస్టు నెలలో ఐఎస్ తన నాయకుడు మరణించినట్లు ప్రకటించింది. అతని స్థానంలో అబూ హాఫ్స్ అల్-హషిమీ అల్-ఖురాషిని చీఫ్గా ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ 2011లో శాంతియుత ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను అణిచివేయడంతో అక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడ జీహాదీ ఉద్యమం బలపడింది. ఈ సంఘర్షణ 5 లక్షల మంది చనిపోయారు. చాలా మంది ప్రజలు తమ సొంత ప్రాంతాల నుంచి వలసలు వెళ్లారు.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..