Chandrababu Bail: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు. కాగా, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడానికి కారణా లేమిటో గత ప్రభుత్వం పేర్కొనలేదని ఆయన చెప్పారు. వేలం నిర్వహించకుండా ఇసుక రీచ్లను ఇతరులకు చంద్రబాబు సర్కార్ అప్పగించిందని ఏజీ తెలిపారు. ఇక, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని సీఐడీ తరపున వాదించిన అడ్వొకేట్ జనరల్ చెప్పారు. విచక్షణారహిత ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పు పట్టిందని ఆయన పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసుపై పూర్తి స్థాయి వాదనలు ఇవాళ కొనసాగనున్నాయి. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టును కోరారు. ఇరు వాదనల తర్వా న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..