AP Government: పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్ కసరత్తు..
- పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు..
- కొత్త పరిశ్రమల కోసం చంద్రబాబు సర్కార్ కసరత్తు..
- గత ప్రభుత్వంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు..
- ఏపీలో పారిశ్రామిక వాడల్లో పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేలా చూసేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది.. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.. ఏపీలో పారిశ్రామిక వాడల్లో పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకునేందేకు రెడీ అవుతున్నారు.. గన్నవరం పరిధిలోని మల్లవల్లి, వీరపనేని గూడెం ఇండస్ట్రీయల్ పార్కుల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ. మల్లవల్లి పారిశ్రామికవాడలో త్వరలో కార్యకలాపాలు నిర్వహించనుందట అశోక్ లేలాండ్. గత ప్రభుత్వంలో వెళ్లిపోయి.. మళ్లీ ఏపీకి తిరిగి రానున్న తొలి సంస్థగా అశోక్ లేలాండ్ నిలవనుంది.
Read Also: Ex-servicemen Murder Case: మాజీ సైనికుడి హత్య కేసు.. వెలుగులోకి సంచలన అంశాలు..!
Also Read
- CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
- Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
- Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
- Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
ఇక, అశోక్ లేలాండ్ సహా 10 కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారట యార్లగడ్డ. మల్లవల్లిలో త్వరలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ ఆచి మసాలా సంస్థ కూడా సిద్ధం అవుతోందని చెబుతున్నారు.. మరోవైపు.. విస్తరణ దిశగా HCL కంపెనీ ఆలోచనలు చేస్తోందట.. విశాఖ, బందరు, తిరుపతి, అనంతపురం జిల్లాలతో పాటు సీఆర్డీఏ పరిధిలో కంపెనీలను తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది చంద్రబాబు సర్కార్.. విశాఖలో సాఫ్ట్ వేర్, అనంత, తిరుపతి కేంద్రంగా హార్డ్ వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, బందరులో బీపీసీఎస్ కంపెనీల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.. సీఆర్డీఏలోకి వివిధ సంస్థలను తిరిగి రప్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
-
Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
-
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!