Ex-servicemen Murder Case: మాజీ సైనికుడి హత్య కేసు.. వెలుగులోకి సంచలన అంశాలు..!
- విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
- శ్రీకృష్ణానగర్లో రాత్రి దివ్యాంగుడు దారుణ హత్య..
- అత్యంత ఘోరంగా గొంతుకోసి.. చేతులు నరికేసిన ఇద్దరు నిందితులు..
- స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా చెబుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-servicemen Murder Case: విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది..గాజువాక జగ్గు జంక్షన్ కి సమీపంలో శ్రీకృష్ణానగర్లో రాత్రి దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత ఘోరంగా గొంతుకోసి, చేతులు నరికేసిన ఇద్దరు నిందితులు గాజువాక పోలీసుస్టేషన్లో లొంగిపోవడం కలకలం రేపింది. స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ హత్యకు దారి తీసిన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి..
Read Also: Russia- Ukraine War: యుద్ధాన్ని ఆపమని పుతిన్కు చెప్పండి.. భారత్కు అమెరికా విజ్ఞప్తి
Also Read
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
పాత కర్నవానిపాలేనికి చెందిన వేమిరెడ్డి అప్పలనాయుడు ఆర్మీలో పని చేసి వచ్చారు. తరువాత అనారోగ్య కారణాలతో కాళ్లు చచ్చుబడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ.. భార్య సుజాత, నాలుగేళ్ల కుమారుడితో నివసిస్తున్నారు. చినగంట్యాడలో ఒక స్థలం విషయంలో అప్పలనాయుడుకి స్థానికులు బంకా రాము, అతని అన్న కుమారుడు బంక అశోక్లతో 2016 నుంచి గొడవలు ఉన్నాయి. తమ మాట వినడం లేదని ప్లాన్ ప్రకారం మట్టుబెట్టాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఇక, దివ్యాంగ వాహనంపై వస్తున్న అతనిపై రాము, అశోక్ ఒక్కసారిగా దాడికి దిగి కత్తితో మెడ, చేతులను దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే అప్పలనాయుడు ప్రాణాలు కోల్పోయారు. మోచేయి, ఇతర అవయవాలు తెగి మూడు అడుగుల దూరంలో పడటం గమనిస్తే నిందితులు ఎంత పాశవికంగా వ్యవహరించారో అర్థమవుతోంది. అప్పలనాయుడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక నిందితులిద్దరూ నేరుగా గాజువాక పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. స్థల విషయంలో తమను ఇబ్బందులకు గురి చేయడంతోనే ఇలా చేసినట్లు నిందితులు చెప్పుకొస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహం తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని ఓదార్చి వివరాలను సేకరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..