Ex-servicemen Murder Case: మాజీ సైనికుడి హత్య కేసు.. వెలుగులోకి సంచలన అంశాలు..!
- విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
- శ్రీకృష్ణానగర్లో రాత్రి దివ్యాంగుడు దారుణ హత్య..
- అత్యంత ఘోరంగా గొంతుకోసి.. చేతులు నరికేసిన ఇద్దరు నిందితులు..
- స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా చెబుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-servicemen Murder Case: విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది..గాజువాక జగ్గు జంక్షన్ కి సమీపంలో శ్రీకృష్ణానగర్లో రాత్రి దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత ఘోరంగా గొంతుకోసి, చేతులు నరికేసిన ఇద్దరు నిందితులు గాజువాక పోలీసుస్టేషన్లో లొంగిపోవడం కలకలం రేపింది. స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ హత్యకు దారి తీసిన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి..
Read Also: Russia- Ukraine War: యుద్ధాన్ని ఆపమని పుతిన్కు చెప్పండి.. భారత్కు అమెరికా విజ్ఞప్తి
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
పాత కర్నవానిపాలేనికి చెందిన వేమిరెడ్డి అప్పలనాయుడు ఆర్మీలో పని చేసి వచ్చారు. తరువాత అనారోగ్య కారణాలతో కాళ్లు చచ్చుబడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ.. భార్య సుజాత, నాలుగేళ్ల కుమారుడితో నివసిస్తున్నారు. చినగంట్యాడలో ఒక స్థలం విషయంలో అప్పలనాయుడుకి స్థానికులు బంకా రాము, అతని అన్న కుమారుడు బంక అశోక్లతో 2016 నుంచి గొడవలు ఉన్నాయి. తమ మాట వినడం లేదని ప్లాన్ ప్రకారం మట్టుబెట్టాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఇక, దివ్యాంగ వాహనంపై వస్తున్న అతనిపై రాము, అశోక్ ఒక్కసారిగా దాడికి దిగి కత్తితో మెడ, చేతులను దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే అప్పలనాయుడు ప్రాణాలు కోల్పోయారు. మోచేయి, ఇతర అవయవాలు తెగి మూడు అడుగుల దూరంలో పడటం గమనిస్తే నిందితులు ఎంత పాశవికంగా వ్యవహరించారో అర్థమవుతోంది. అప్పలనాయుడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక నిందితులిద్దరూ నేరుగా గాజువాక పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. స్థల విషయంలో తమను ఇబ్బందులకు గురి చేయడంతోనే ఇలా చేసినట్లు నిందితులు చెప్పుకొస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహం తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని ఓదార్చి వివరాలను సేకరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!