Ex-servicemen Murder Case: మాజీ సైనికుడి హత్య కేసు.. వెలుగులోకి సంచలన అంశాలు..!
- విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
- శ్రీకృష్ణానగర్లో రాత్రి దివ్యాంగుడు దారుణ హత్య..
- అత్యంత ఘోరంగా గొంతుకోసి.. చేతులు నరికేసిన ఇద్దరు నిందితులు..
- స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా చెబుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-servicemen Murder Case: విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది..గాజువాక జగ్గు జంక్షన్ కి సమీపంలో శ్రీకృష్ణానగర్లో రాత్రి దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత ఘోరంగా గొంతుకోసి, చేతులు నరికేసిన ఇద్దరు నిందితులు గాజువాక పోలీసుస్టేషన్లో లొంగిపోవడం కలకలం రేపింది. స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ హత్యకు దారి తీసిన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి..
Read Also: Russia- Ukraine War: యుద్ధాన్ని ఆపమని పుతిన్కు చెప్పండి.. భారత్కు అమెరికా విజ్ఞప్తి
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
పాత కర్నవానిపాలేనికి చెందిన వేమిరెడ్డి అప్పలనాయుడు ఆర్మీలో పని చేసి వచ్చారు. తరువాత అనారోగ్య కారణాలతో కాళ్లు చచ్చుబడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ.. భార్య సుజాత, నాలుగేళ్ల కుమారుడితో నివసిస్తున్నారు. చినగంట్యాడలో ఒక స్థలం విషయంలో అప్పలనాయుడుకి స్థానికులు బంకా రాము, అతని అన్న కుమారుడు బంక అశోక్లతో 2016 నుంచి గొడవలు ఉన్నాయి. తమ మాట వినడం లేదని ప్లాన్ ప్రకారం మట్టుబెట్టాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఇక, దివ్యాంగ వాహనంపై వస్తున్న అతనిపై రాము, అశోక్ ఒక్కసారిగా దాడికి దిగి కత్తితో మెడ, చేతులను దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే అప్పలనాయుడు ప్రాణాలు కోల్పోయారు. మోచేయి, ఇతర అవయవాలు తెగి మూడు అడుగుల దూరంలో పడటం గమనిస్తే నిందితులు ఎంత పాశవికంగా వ్యవహరించారో అర్థమవుతోంది. అప్పలనాయుడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక నిందితులిద్దరూ నేరుగా గాజువాక పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. స్థల విషయంలో తమను ఇబ్బందులకు గురి చేయడంతోనే ఇలా చేసినట్లు నిందితులు చెప్పుకొస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహం తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని ఓదార్చి వివరాలను సేకరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!