Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. తిరుమల ఏర్పాట్ల గురించి ఉన్నతాధికారులు డీజీపీకి వివరించారు. ఈ సమావేశంలో
డీఐజీలు రాజశేఖర్ బాబు, రవిప్రకాష్, ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, సీవీయస్వో నరసింహ కిషోర్లు పాల్గొన్నారు. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి డీజీపీకి వివరించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ చేస్తామన్నారు.
Also Read: Janasena: టీడీపీతో జనసేన సమన్వయ కమిటీ.. అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్
Also Read
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
బ్రహ్మోత్సవాల సమయంలో నాలుగు అంశాలపై భద్రతా సిబ్బంది దృష్టి సారించాలని డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. క్రౌడ్ మేనేజ్మేంట్, ట్రాఫిక్ మేనేజ్మేంట్, వీఐపీల భద్రత, భక్తుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారిని గైడ్ చేయాలన్నారు. మాడవీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరాయంగా పర్యవేక్షించాలని తెలిపారు.
Also Read: Pawan Kalyan: ద్వేషంతో కూడుకున్న వాదనలు, వ్యక్తులు కాల గర్భంలో కలిసిపోతారు..
సమీక్ష అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. 6 మంది ఎస్పీలతో సహా 4900 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగితే తిరుపతిలోనే ట్రాఫిక్ నియంత్రణ చేస్తామన్నారు. తిరుపతిలో మూడు ప్రాంతాలలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. నాలుగు మాడ వీధులలో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేశామని వివరించారు. దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్ కెమరాలు వినియోగిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!