Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Deputy Pawan Kalyan Spoke About Ttd Properties Protection

Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది..

Published Date :September 23, 2024 , 7:19 pm
By Mahesh Jakki
  • తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిది
  • భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారు
  • భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి
Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారన్నారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారని పవన్ వెల్లడించారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయన్నారు.

భక్తులు ఏ ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిర్దకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలో నియమితమైన టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికి ఎందుకు ఉత్సాహపడిందని ఆరోపించారు. వారిని ఆ విధంగా నడిపించింది ఎవరు? అనేది బయటకు తీస్తామన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్ళకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు వస్తున్నాయి.తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. ఈ క్రమంలో గత పాలక మండళ్ళు టీటీడీ ఆస్తులు విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలన్నారు. వైసీపీ పాలకులు నియమించిన పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని, ఆ ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారన్నారు. నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించిందన్నారు. గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అంబర్ పేట కలాన్ ప్రాంతంలో స్థలం, మల్కాజిగిరి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఫ్లాట్, నాందేడ్, బెంగళూరుల్లోని కొన్ని ఆస్తులు అమ్మకానికి సిద్ధం చేసిందని పవన్ అన్నారు.

Read Also: Tension at Dharmavaram: ధర్మవరంలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ , టీడీపీ కార్యకర్తలు

ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న మా పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బాధ్యతగా, బలంగా స్పందించాము, అప్పుడు వేలం ద్వారా విక్రయం ఆగిందన్నారు. ఆభరణాలు, నగలను పరిశీలించాలన్నారు. అదే విధంగా తిరుమల శ్రీవారికి కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు నగలు, ఆభరణాలు అందజేశారని పవన్ చెప్పారు. వాటి జాబితాను కూడా పరిశీలించి.. వాటి పరిస్థితిని కూడా గణించాలని టీటీడీ అధికారులకు సూచిస్తున్నామన్నారు. ఎందుకంటే స్థిరాస్థులను ఆమ్మేయాలని చూసిన వాళ్ళు ఆభరణాలు, బంగారం విషయంలో కూడా కచ్చితంగా పెడపోకడలతో ఏవైనా అవాంచనీయ నిర్ణయాలు తీసుకున్నారా అనే అనుమానం ఉందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయం ఎటు వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి భక్తుడి నుంచి రూ.10,500 తీసుకున్నారని.. ఇందులో బిల్లు రూ.500కే ఇచ్చారన్నారు.

ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్ళు ఎటు మళ్లించాయో కూడా విచారణ చేయాలని సీఎంను కోరామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని అప్పటి పాలకులు చెప్పారన్నారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? సంస్థ ఏమిటని ప్రశ్నించారు. ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియచేయడం అవసరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాదు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని సీఎంకి సూచిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖాలు పెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల వివరాలు, సదరు ఆస్తుల ద్వారా వస్తున్న రాబడినీ ప్రజలకు తెలియచేయడం అవసరమన్నారు. భక్తులకు వివరాలు అందుబాటులోకి వస్తే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయన్నారు. ఆలయాల పాలక మండళ్ళు జవాబుదారీ తనంతో పని చేస్తాయన్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Deputy Pawan Kalyan
  • telugu news
  • tirumala
  • Tirumala Laddu Controversy

తాజావార్తలు

  • Monalisa: నా కూతురుపై ‘‘లవ్ జిహాద్’’, సీఎం గారు సాయం చేయండి.. మోనాలిసా తండ్రి కంటతడి..

  • Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?

  • Kim jong un: ఓ వైపు ఇరాన్ యుద్ధం.. ఏకంగా 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిన కిమ్..

  • Minister Narayana: గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి..

  • Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!

ట్రెండింగ్‌

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions