Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Deputy Cm Pawan Kalyan Responds Pithapuram Maharaja Family Land Dispute

Pawan Kalyan: పిఠాపురం మహారాజా మేనకోడలు, కుమారుల ఆవేదన.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Published Date :July 31, 2024 , 3:28 pm
By Mahesh Jakki
  • పిఠాపురం మహారాజా కుటుంబం ఆస్తుల కబ్జాపై స్పందించిన పవన్‌ కల్యాణ్
  • విచారణ చేయాలని అధికారులకు ఆదేశాలు
Pawan Kalyan: పిఠాపురం మహారాజా మేనకోడలు, కుమారుల ఆవేదన.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan: పిఠాపురం మహారాజా వారసులకు చెందిన ఆస్తుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే విచారణ చేయాలని కలెక్టర్, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వివాదంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆర్డీవో కిషోర్ విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని.. ఈ ఆస్తికి సంబంధించి వివాదం కోర్టు పరిధిలో ఉందని.. ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ చంద్రలేఖ కుటుంబానికి చెందినదని.. శాఖా పరంగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఆస్తి తమదని చెప్తే సరిపోదు దానికి తగ్గట్లుగా డాక్యుమెంట్స్ ఉండాలన్నారు. ఫైనల్ జడ్జిమెంట్ ప్రకారం ఆస్తి ఎవరిదైతే వారికే చెందుతుందనన్న ఆర్టీవో కిషోర్ స్పష్టం చేశారు.

Read Also: AP Government: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఈ ఇంట్లో 50 ఏళ్లుగా ఉంటున్నామని పిఠాపురం మహరాజా కుటుంబ సభ్యులు వెల్లడించారు. మాపై దాడి చేసి కొట్టి బయటికి పంపించేశారని.. సామానులు బయటకు విసిరేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మా పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామన్నారని చెప్పుకొచ్చారు. ఆస్తి తనదని చెబుతున్న లక్ష్మి డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే ఇల్లు వదిలేస్తామని వారు వెల్లడించారు. ఆమె టీడీపీలో యాక్టివ్‌గా తిరుగుతుందని.. వారసత్వ హక్కుగా వచ్చిన ఆస్తి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అధికారులు ఎంక్వయిరీ చేసి ఎవరిది అయితే వారికి ఈ ఇంటిని అప్పగించాలని కోరారు.

“ఐదున్నర శతాబ్ధాలుగా ఇదే ఇంటిలో ఉంటున్నాం. కోర్టు డిక్రీ ద్వారా మాకు ఇది దాఖలు పడింది. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటిని తాము కొన్నామంటూ కొందరు వ్యక్తులు వచ్చి ఖాళీ చేయమని బెదిరించడంతోపాటు దౌర్జన్యం చేశారు. వీరి వెనుక కొందరు నాయకులు ఉన్నారు. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మాకు న్యాయం చేయాలి. లేకుంటే చావే శరణ్యం’ అంటూ పిఠాపురం మహారాజా మేనకోడలు, ఆమె కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరు పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి మంగళవారం విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోని డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు.

పిఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగాగల వీధిలో మహారాజా మేనకోడలు విన్నపాల చంద్రలేఖ(78), తన ఇద్దరు కుమారులు రంగారావు, మాధవరావుతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు 1970 నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. దీనిపై వివాదం ఏర్పడగా 1974లో కోర్టు ద్వారా డిక్రీ పొందారు. రెండు నెలల క్రితం ఈ ఇంటిని తాము కొనుగోలు చేశామంటూ జిగటాల లక్ష్మి అనే మహిళతోపాటు కొందరు వ్యక్తులు వచ్చి చెప్పి ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారన్నారు. ఇది తమ ఇల్లు అని, మీకు ఎవరు అమ్మారని ప్రశ్నించగా వినకుండా తమపై రెండు, మూడు సార్లు వచ్చి దౌర్జన్యం చేయడంతోపాటు తమను ఇంటి నుంచి బయటకు లాగి మెడలో గొలుసు లాక్కుని పోయారని చంద్రలేఖ, కుమారులు తెలిపారు. వీరికి కొందరు నేతలు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కోరుతూ మహారాజా మేనకోడలు విన్నపాల చంద్రలేఖ, కుమారుడు మాధవరావు వీడియో ద్వారా కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Deputy CM Pawan Kalyan
  • ap news
  • pawan kalyan
  • Pithapuram Maharaja

తాజావార్తలు

  • Instagram Subscription Trend: సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?

  • Crude Oil: హర్మూజ్ సంక్షోభం.. చమురు ధరలు భారీగా పెంపు..

  • Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం

  • Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions