AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
- నేడు ఏపీ కేబినెట్ సమావేశం
- కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు
- అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు ప్రతిపాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి.
ఈ సమావేశంలో సీఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం 80 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి మూడు ఎకరాల భూమిని కేటాయించే అంశం కూడా క్యాబినెట్ పరిశీలనకు రానుంది. ఇక పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఏపీఎస్ఐఆర్డీకి ఐదు ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.
Also Read
- Beauty Tips: వర్షాకాలంలోనూ సన్స్క్రీన్ అవసరమేనా?.. చర్మ నిపుణులు ఏం చెబుతున్నారు..
- Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
Also Read: Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్ల వ్యయానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశముంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం, గ్యాస్ నిల్వలు సహా ఇతర ముఖ్య అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Beauty Tips: వర్షాకాలంలోనూ సన్స్క్రీన్ అవసరమేనా?.. చర్మ నిపుణులు ఏం చెబుతున్నారు..
-
Peddi OTT : ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన పెద్ది.. ఎక్కడ చూడాలంటే
-
Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?
-
Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
-
Wamiqa Gabbi: సుమో రెజ్లర్ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
ట్రెండింగ్
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!