Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Bjp Chief Purandeswari Letter To Cji Chandrachud Over Ysrcp Mp Vijayasai Reddy

Purandeswari vs Vijayasai Reddy: పురంధేశ్వరి-విజయసాయిరెడ్డి మధ్య ముదిరిన వార్‌.. సీజేఐకి ఏపీ బీజేపీ చీఫ్‌ లేఖ

NTV Telugu Twitter
Published Date :November 4, 2023 , 12:16 pm
By Sudhakar Ravula
Purandeswari vs Vijayasai Reddy: పురంధేశ్వరి-విజయసాయిరెడ్డి మధ్య ముదిరిన వార్‌.. సీజేఐకి ఏపీ బీజేపీ చీఫ్‌ లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Purandeswari vs Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి, వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య రోజురోజుకూ వార్‌ ముదురుతోంది.. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి పురంధేశ్వరి లేఖ రాయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలి.. విజయసాయి రెడ్డే కాదు.. వైఎస్‌ జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు అంటూ ఆమె సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని రాసుకొచ్చిన పురంధేశ్వరి.. CBI, IT, ED కేసుల దర్యాప్తు జరగకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటున్నారు. విచారణలు, వాయిదా వేయిచుకోవడం, విచారణకు హాజరు కాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగులో ఉంటున్నాయి. విజయ సాయిరెడ్డిపై IPC కింద నమోదైన కేసులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సెక్షన్ల కింద విజయ సాయిరెడ్డిపై నమోదైన కేసులను పరిశీలిస్తే తిమ్మిని బమ్మిని చేయగలరని అర్థమవుతోందని పేర్కొన్న ఆమె.. వైఎస్‌ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయ సాయిరెడ్డి. జగన్ కేసులో సాయిరెడ్డిని కింగ్‌పిన్ అని సీబీఐ స్పష్టం చేసిందని గుర్తుచేశారు.. అంతగా ప్రభావ వంతం చేయలేని పరిస్థితుల్లో విజయసాయిపై కేసులు నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు విజయసాయు అత్యున్నత పదవుల్లో ఉన్నారని తెలిపారు.

ఇక, ఇప్పుడు ఏపీలో వేలాది కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకుంటున్నారు.. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా పలుకుబడిని ఉపయోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి ఆ తర్వాత అప్రూవరుగా మారిన వారు విజయసాయి దగ్గరి బంధువులే అని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. విజయసాయి రెడ్డి తన బినామీల ద్వారా ఏపీలోని కొన్ని డిస్టలరీలను నిర్వహిస్తున్నారు. ఈ అంశం వెలుగులోకి రాగానే ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోం మంత్రికి లేఖలు కూడా రాశాం. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీగా ఉన్న సమయంలో విజయ సాయి చాలా మందిని బెదిరించి వారి ఆస్తులు కబ్జా చేయించారని.. బలవంతంగా డబ్బు వసూళ్లు చేశారని.. దీనికోసం సీఎం సొంత జిల్లా కడప నుంచి తెప్పించిన గూండాలను ఉపయోగించారు. అనేక మంది వ్యాపార వేత్తలు, రియల్టర్లను బెదిరించి నామ మాత్రపు డబ్బు చెల్లించి విలువైన భూములు గుంజుకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు.

విజయసాయి కూతురు, అల్లుడు కంపెనీల కోసం అనేక ఎకరాల విలువైన భూమిని తక్కువ ధరకు ఇచ్చేలా అధికార దుర్వినియోగం చేశారని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి.. విశాఖపట్నం సమీపంలోని భీమిలిలో రూ. దాదాపు రూ. 177 కోట్ల భూములను విజయ సాయిరెడ్డి కుమార్తె కంపెనీ కేవలం రూ. 57 కోట్లకే కొనుగోలు చేసింది. వాస్తవానికి విజయ సాయిరెడ్డి దస్పల్లా భూములను బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. న్యాయ వివాదంతో అప్పటి వరకు ప్రభుత్వ నిషిద్ధ జాబితాలో ఉన్న దస్పల్లా భూములను.. ఒప్పందం కుదిరిన వెంటనే నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. విజయసాయి రెడ్డి ఈ బెయిల్‌ పై ఉండడం వల్లే ఇవన్నీ చేయగలిగారు. విజయసాయి బంధువులు, బినామీలు రుషికొండలోని బే పార్క్ రిసార్ట్‌ బేరసారాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా భూమి, ఇసుక, మైనింగ్, మద్యంలో విజయసాయి.. ఆయన బినామీల అక్రమాలపై చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ సమస్యలలో కొన్నింటిని బాధ్యత కలిగిన పౌరురాలిగా ప్రజా బాహుళ్యంలో లేవనెత్తాను. దీనిపై బహిరంగంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి నన్ను బెదిరించారు.. నేను ఇటువంటి అంశాలను నా వద్ద ఉన్న సమాచారంతో భవిష్యత్తులో మాట్లాడితే, నన్ను ప్రజల మధ్య బయట తిరగకుండా చేస్తానని వ్యక్తిగత దూషణలతో విజయసాయి రెడ్డి నన్ను బెదిరించారు.. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే విజయసాయిరెడ్డి ఎలా బెదిరిస్తారోననే దానిపై నన్ను బెదిరించిన తీరే నిదర్శనంగా పేర్కొన్నారు.

ఏపీలోని పెద్దలు, వ్యాపారవేత్తలు సాధారణ ఫోన్లలో మాట్లాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి.. విజయసాయికి భయపడి వాట్సాప్ కాల్స్ లేదా పేస్ టైంలు మాత్రమే వాడుతున్నారు. ఈ బహిరంగ బెదిరింపులను బెయిల్ షరతుల ఉల్లంఘనగా పరిగణించాలి. గత పదేళ్లుగా అనేక ఉల్లంఘనలతో అతను వ్యవస్థలను ఎలా నియంత్రిస్తున్నారోననేది పరిశీలించాలి. విజయసాయి రెడ్డి బెయిల్‌ను పొడిగించడాన్ని పరిశోధించాలి. ఇంతకు ముందు జరిగిన ఒక సంఘటనలో కూడా మాజీ ఎంపీ వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేసినప్పుడు.. ప్రెస్ మీట్ పెట్టి అది కేవలం గుండెపోటు అని చెప్పారు. వివేకాది సహజ మరణమని చెప్పిన మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనే అంశం పరిగణలోకి తీసుకోవాలి. 10 ఏళ్లుగా వ్యవస్థలోని కొన్ని అవకాశాలను వినియోగించుకుని బెయిల్‌పై ఉన్నారు. వైఎస్‌ జగన్, విజయసాయి రెడ్డి బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలి. వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ ఒక కొలిక్కి తేవాలి. దోషులని తేలిన వారిపైన న్యాయపరమైన చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ పౌరులకు మరింత హాని జరగకుండా నిరోధించాలని తన లేఖలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ను తన లేఖలో విజ్ఞప్తి చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • cji chandrachud
  • mp vijayasai reddy
  • Purandeswari

తాజావార్తలు

  • Air India Crash: విమానాల్లో సురక్షితమైన సీట్లు ఉంటాయా.? నిపుణులు ఏం చెబుతున్నారు..

  • Kalpika : సినీ నటి కల్పిక‌పై మరో కేసు నమోదు

  • Minister Narayana: ఆ ఇద్దరి వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది..

  • Free Bus Effect: ఉచిత బస్సు ఆడవాళ్లకు.. డ్రైవర్లు, కండక్టర్లకు ఫ్రీగా దెబ్బలు!

  • PM Modi: “సిందూర్‌” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions