Purandeswari: విధానాలు ఎత్తిచూపిస్తే కోవర్ట్ అంటే ఎలా..? 175 స్థానాల్లో పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అంటే ఎలా..? అంటూ మండిపడ్డారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే… ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. కరువు జిల్లాలైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చెరువులకు నీరు ఇస్తామని చెప్పి అందించలేకపోయారని దుయ్యబట్టారు.. అభివృద్ధికి బీజేపీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. కేంద్ర నిధులతో స్టిక్కర్లు వేసుకుని వైసీపీ పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also: Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు పురంధేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా..? అంటూ మండిపడ్డారు. విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటే ఎలా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నాం… రాష్ట్రంలోని 175 స్థానాల్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని హెచ్చరించారు. అవినీతి మరక లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని స్పష్టం చేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి. కాగా, ఏపీలో ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు ఇవిగో అంటూ పురంధేశ్వరి కామెంట్లు చేస్తూ.. కేంద్రానికి ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. పురంధేశ్వరి టీడీపీ కోవర్ట్గా పనిచేస్తున్నారంటూ అధికార వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విదితమే.. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పురంధేశ్వరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
తాజావార్తలు
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!