Purandeswari: విధానాలు ఎత్తిచూపిస్తే కోవర్ట్ అంటే ఎలా..? 175 స్థానాల్లో పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అంటే ఎలా..? అంటూ మండిపడ్డారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే… ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. కరువు జిల్లాలైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చెరువులకు నీరు ఇస్తామని చెప్పి అందించలేకపోయారని దుయ్యబట్టారు.. అభివృద్ధికి బీజేపీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. కేంద్ర నిధులతో స్టిక్కర్లు వేసుకుని వైసీపీ పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also: Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు పురంధేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా..? అంటూ మండిపడ్డారు. విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటే ఎలా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నాం… రాష్ట్రంలోని 175 స్థానాల్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని హెచ్చరించారు. అవినీతి మరక లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని స్పష్టం చేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి. కాగా, ఏపీలో ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు ఇవిగో అంటూ పురంధేశ్వరి కామెంట్లు చేస్తూ.. కేంద్రానికి ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. పురంధేశ్వరి టీడీపీ కోవర్ట్గా పనిచేస్తున్నారంటూ అధికార వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విదితమే.. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పురంధేశ్వరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!