AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపు ( ఫిబ్రవరి 11న) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10: 30కి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటసేపు స్పీచ్ ఉండే అవకాశం ఉంది. ఇక, రేపు మార్నింగ్ 11: 30 గంటలకి బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక, ఈ నెల 14వ తేదీన 2026-27కి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు.
Read Also: Peddi Overseas Rights : పెద్ది ఓవర్సీస్ రైట్స్.. చరణ్ కెరీర్లోనే రికార్డ్ డీల్
అయితే, కాసేపట్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించే ఆటలు, సంస్కృతిక కార్యక్రమాలపై స్పీకర్ అయ్యన్న సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యుల ప్రశ్నలు, వాటికి సమాధానాలపై సమీక్షించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు కల్పించే భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు.
