Virat Kohli: కోహ్లీని మీరైనా కాస్త ఆపండి.. అనుష్క శర్మకు స్పెషల్ రిక్వెస్ట్!
- టెస్టు క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్
- టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న కోహ్లీ
- వీడ్కోలు పలకొద్దని కోరుతున్న ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఓవైపు భారత మాజీ క్రికెటర్లు, మరోవైపు ఫాన్స్ కూడా విరాట్ కోహ్లీ ఇప్పుడే టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలకొద్దని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు.’బాబీజీ..
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావద్దని విరాట్ భాయ్కి మీరైనా కాస్త చెప్పండి’ అని ట్వీట్ చేశాడు. ఇందుకు తాజాగా విరాట్, అనుష్కలు ముంబైలో కలిసి వెళ్తున్న వీడియోను జత చేశాడు. ‘అనుష్క జీ.. కోహ్లీని మీరైనా కాస్త ఆపండి’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Also Read: Ricky Ponting: విమానం ఎక్కాక.. మనసు మార్చుకున్న రికీ పాంటింగ్!
ఐపీఎల్ 2025 అనంతరం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. 5 టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ఆరంభం కానుంది. త్వరలోనే బీసీసీఐ ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించనుంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోకుండా బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ చర్చలు జరుపుతుందట. అనుభవజ్ఞుడైన విరాట్ ఇంగ్లండ్ సిరీస్లో భారత్కు కీలకమవుతాడని బీసీసీఐ భావిస్తోంది. చూడాలి మరి కింగ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఇక ఐపీఎల్ 2025లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో 505 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఈసారి బెంగళూరు తన ఐపీఎల్ టైటిల్ కలను సాకారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!