Manipur Horror: మణిపూర్లో మరో దారుణం.. ప్రాదేయపడినా కనికరించకుండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Horror: జాతి హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్టమైన మణిపూర్లో అకృత్యాలు ఆగడం లేదు. అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదుపేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్లోని ఉభయసభల్లోనూ నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురాచంద్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై ఐదారుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వదిలేయమని ప్రాదేయపడినా కనికరించకుండా ఈ పాశవిక చర్యకు ఒడిగట్టారు. బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మణిపూర్లో ఈ సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మే 3న జాతి ఘర్షణలు చెలరేగడంతో చురాచంద్పూర్లోని తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా తనపై కుకీ వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 37 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. “మేము గుంపు నుండి తప్పించుకోవడానికి వీలైనంత వేగంగా పరిగెత్తాము” అని మహిళ తన పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.
Also Read: Road Accident: పెళ్లైన 2 నెలలకే మృత్యుఒడిలోకి.. రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మే 3న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కుకీ దుండగుల బృందం ఆ మహిళతో సహా పలు ఇళ్లకు నిప్పుపెట్టింది. గందరగోళం మధ్య, ఆమె తన మేనకోడలు, ఇద్దరు కుమారులతో, తన కోడలుతో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే దాదాపు అర కిలోమీటరు దూరం పరుగెత్తడంతో ఆమె అదుపుతప్పి కిందపడింది. ఆమె కోడలు పిల్లలతో సురక్షితంగా పరిగెత్తుతుండగా, ఐదారుగురు దుర్మార్గులు ఆ మహిళను అడ్డుకున్నారు.ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమెపై శారీరకంగా దాడి చేసి, క్రూరమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Also Read: Nirmala Sitharaman: అసెంబ్లీలో జయలలిత చీర లాగి ఎగతాళి చేశారు.. డీఎంకేపై కేంద్ర మంత్రి ఫైర్
“నేను ఏడ్చినప్పటికీ ఎవరి నుండి సహాయం లేదు. ఆ తర్వాత, మరికొందరు కుకీ దుర్మార్గులు మళ్లీ వారితో చేరారు. ఆ సమయంలో, నేను స్పృహ కోల్పోయాను. తరువాత, నేను స్పృహలోకి వచ్చాక, కొంతమంది మెయిటీ వ్యక్తులు చుట్టుముట్టబడిన ఇంట్లో నేనున్నాను.” అని మహిళ తన ప్రకటనలో పేర్కొంది.బుధవారం బిష్ణుపూర్లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. తదుపరి విచారణ కోసం చురచంద్పూర్ పోలీస్ స్టేషన్కు పంపబడింది. ఎఫ్ఐఆర్ అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ మహిళ ఇప్పుడు సహాయక శిబిరంలో నివసిస్తోంది. ఇన్ని రోజుల పాటు కుటుంబ పరువు పోతుందేమోనని ఆ బాధను భరిస్తూ వచ్చానని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం బయటకు తెలిస్తే జాతి నుంచి వెలివేస్తారేమోనన్న భయంతో బయటకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.