Physical Harassment: కోల్కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు
- కోల్కతాలో మరో ఉదంతం వెలుగులోకి
- ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులు
- హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులు
- తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన మహిళ
- ఆమె నిద్రిస్తున్న సమయంలో సంఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కోల్కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఐసీహెచ్)లోని పిల్లల వార్డులో తాను నిద్రిస్తున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేస్తున్న 26 ఏళ్ల తనయ్పాల్గా గుర్తించారు.
Horrifying incident: చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
నివేదిక ప్రకారం.. తనయ్ పాల్ పిల్లల వార్డుకు వచ్చి మహిళను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. ఆమె వస్త్రాలను కూడా విప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్లో రికార్డు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కోల్కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. నిందితుడి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఆ తరువాత.. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. పోలీసు కస్టడీకి ఇచ్చింది.
Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..
మరోవైపు.. కోల్కతాలోని ఆర్జి కర్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం-హత్య కేసుపై బెంగాల్ లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ కేసులో సిబిఐ ఆదివారం మెడికల్ ఇనిస్టిట్యూట్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్లను కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో ఘోష్పై సాక్ష్యాలను తారుమారు చేసినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అవినీతి కేసులో ఘోష్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మండల్ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!