Loksabha Elections 2024: పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింస.. చెరువులో దర్శనమిచ్చిన ఈవీఎంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఓటింగ్ ప్రారంభమైన 20 నిమిషాల్లోనే స్థానిక ప్రజలు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను చెరువులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసుల వాహనాలపై చెట్లు కొమ్మలు విసిరి నిరసనకు దిగారు.
AP-TG Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన కుల్తాలిలోని మేరీగంజ్లోని బూత్ నంబర్ 40, 41లో జరిగింది. తృణమూల్కు మద్దతిచ్చిన అక్రమార్కులు తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తోసిపుచ్చింది. అదే సమయంలో.. సెక్టార్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఈ సమాచారం తెలుసుకుని జైనగర్ బీజేపీ అభ్యర్థి అశోక్ కందారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కమిషన్ ప్రతినిధులు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే దానిపై కమిషన్ విచారణ జరుపుతోంది. సంఘటన తర్వాత ప్రత్యామ్నాయ ఈవీఎంలతో బూత్లో మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. చెరువులో ఈవీఎంలు విసిరిన ఘటన పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాకాండను తలపిస్తోంది. గత ఏడాది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల అక్రమార్కులు బ్యాలెట్ బాక్సులను నీటిలో పడేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!