Amit Shah: లాలూ, నితీష్ కుమార్పై తీవ్ర విమర్శలు.. దర్భంగా ఎయిమ్స్ పనులపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి అమిత్ షా శనివారం బీహార్లో పర్యటించారు. ఝంజర్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లపై విరుచుకుపడ్డారు. బీహార్ దుస్థితికి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ బాధ్యులని విమర్శించారు. అంతేకాకుండా.. మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు.
బీహార్లో “రక్షాబంధన్, జన్మాష్టమికి సెలవులు ఉండవని ఇటీవల నితీష్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. దర్భంగా ఎయిమ్స్ గురించి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దర్భంగాలో ఎయిమ్స్ను రూ.1250కి ప్రతిపాదించిందని తెలిపారు. దీని కోసం నితీశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీకి 81 ఎకరాల భూమిని ఇచ్చి.. వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు. ఆ తర్వాత గుంతలు ఉన్న స్థలం ఎయిమ్స్ నిర్మాణానికి ఇచ్చారని చెప్పారు. దీంతో సరిగా లేక ఎయిమ్స్ నిర్మాణం జరగలేదు. బీహార్ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోకుంటే దర్భంగాలో ఇప్పటికి ఎయిమ్స్ నిర్మాణం పూర్తై రోగులకు వైద్య సేవలు అందేవని చెప్పారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Minister Harish Rao: ఆ పార్టీ వాళ్ళు తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ
బీహార్లో పర్యాటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను అమిత్ షా వివరించారు. రామాయణ సర్క్యూట్లో సీతామర్హి, బక్స్, దర్భంగాలను చేర్చి.. మోడీ ప్రభుత్వం పర్యాటకాన్ని జోడించిందన్నారు. మిథిలా మఖానాకు జీఐ ట్యాగ్ ఇచ్చే పని బీజేపీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. అంతేకాకుండా.. రూ.125 కోట్లతో దర్భంగా, సక్రి, జయనగర్, సమస్తిపూర్ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపడుతోందని అన్నారు.
Baramulla Encounter: ముగ్గురు ఉగ్రవాదులు హతమార్చిన సైన్యం.. పాక్ వైపు నుంచి కాల్పులు..
మరోవైపు అటల్జీ ప్రారంభించిన కోసి మహాసేతును యూపీఏ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని.. దానిని పూర్తి చేసే పని మోడీ ప్రభుత్వం చేసిందని అమిత్ షా అన్నారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉందని.. ఈ సమయంలో బీహార్కు ఏం ఇచ్చారని లాలూని ప్రశ్నించారు. అంతేకాకుండా.. రూ.1200 కోట్లతో పాట్నా ఎయిర్పోర్టు పునరాభివృద్ధి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!