Amit Shah: లాలూ, నితీష్ కుమార్పై తీవ్ర విమర్శలు.. దర్భంగా ఎయిమ్స్ పనులపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి అమిత్ షా శనివారం బీహార్లో పర్యటించారు. ఝంజర్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లపై విరుచుకుపడ్డారు. బీహార్ దుస్థితికి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ బాధ్యులని విమర్శించారు. అంతేకాకుండా.. మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు.
బీహార్లో “రక్షాబంధన్, జన్మాష్టమికి సెలవులు ఉండవని ఇటీవల నితీష్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. దర్భంగా ఎయిమ్స్ గురించి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దర్భంగాలో ఎయిమ్స్ను రూ.1250కి ప్రతిపాదించిందని తెలిపారు. దీని కోసం నితీశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీకి 81 ఎకరాల భూమిని ఇచ్చి.. వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు. ఆ తర్వాత గుంతలు ఉన్న స్థలం ఎయిమ్స్ నిర్మాణానికి ఇచ్చారని చెప్పారు. దీంతో సరిగా లేక ఎయిమ్స్ నిర్మాణం జరగలేదు. బీహార్ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోకుంటే దర్భంగాలో ఇప్పటికి ఎయిమ్స్ నిర్మాణం పూర్తై రోగులకు వైద్య సేవలు అందేవని చెప్పారు.
Also Read
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
Minister Harish Rao: ఆ పార్టీ వాళ్ళు తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ
బీహార్లో పర్యాటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను అమిత్ షా వివరించారు. రామాయణ సర్క్యూట్లో సీతామర్హి, బక్స్, దర్భంగాలను చేర్చి.. మోడీ ప్రభుత్వం పర్యాటకాన్ని జోడించిందన్నారు. మిథిలా మఖానాకు జీఐ ట్యాగ్ ఇచ్చే పని బీజేపీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. అంతేకాకుండా.. రూ.125 కోట్లతో దర్భంగా, సక్రి, జయనగర్, సమస్తిపూర్ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపడుతోందని అన్నారు.
Baramulla Encounter: ముగ్గురు ఉగ్రవాదులు హతమార్చిన సైన్యం.. పాక్ వైపు నుంచి కాల్పులు..
మరోవైపు అటల్జీ ప్రారంభించిన కోసి మహాసేతును యూపీఏ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని.. దానిని పూర్తి చేసే పని మోడీ ప్రభుత్వం చేసిందని అమిత్ షా అన్నారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉందని.. ఈ సమయంలో బీహార్కు ఏం ఇచ్చారని లాలూని ప్రశ్నించారు. అంతేకాకుండా.. రూ.1200 కోట్లతో పాట్నా ఎయిర్పోర్టు పునరాభివృద్ధి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
తాజావార్తలు
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!