China Virus: చైనాలో కొత్త వైరస్.. అమెరికా అప్రమత్తం.. రాకపోకలు నిషేదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో మరో వైరల్ వేగంగా వ్యాపిస్తోంది. దీని కారణంగా చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు అమెరికా, చైనాల మధ్య ప్రయాణ నిషేధం విధించాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్ను డిమాండ్ చేశారు. మార్కో రూబియో నేతృత్వంలోని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు నిన్న యూఎస్ ప్రెసిడెంట్ కు లేఖ రాశారు.
Read Also: Heart Attack: గుజరాత్కు గుండెపోటు..! 6 నెలల్లో 1,052 మంది మృతి
Also Read
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
ఇక, మార్కో రూబియో నేతృత్వంలోని రిపబ్లికన్ సెనేటర్ల బృందం అధ్యక్షుడు బిడెన్కు రాసిన లేఖలో ఆసియా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న శ్వాసకోశ వ్యాధి (చైనా న్యుమోనియా) గురించి మరింత సమాచారం వచ్చే వరకు యూఎస్- చైనా మధ్య రాకపోకలు నిషేధించాలని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యాధి వల్ల కలిగే నష్టాల గురించి మరింత సమాచారం తెలుసుకునే వరకు ఆంక్షలు విధించాలని కోరారు. అయితే, గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభివృద్ధి చెందుతున్న వ్యాధిపై చైనా నుండి వివరణాత్మక నివేదికను కోరినప్పుడు కేసుల పెరుగుదల ప్రపంచ సమస్యగా మారింది అని తెలిపింది.
అమెరికాలో పెరుగుతున్న ఆందోళన:
అయితే, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) ప్రజారోగ్య సంక్షోభాల గురించి అబద్ధాలు చెబుతుందని యూఎస్ సెనేటర్లు ఆరోపించారు. కరోనా సమయంలో చైనా అబద్దాలు చెప్పడం వల్లే ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందించడంలో చైనా అధికారుల సహకారం లేకపోవడం గురించి WHO పదేపదే ఆందోళనలు చేసింది అని సెనేటర్లు అన్నారు.
Read Also: Salaar Trailer: సార్… ట్రైలర్ లో లాగా సినిమాలో కూడా ప్రభాస్ మధ్యలో రాడు కదా?
అమెరికన్ల ఆరోగ్యాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్ను డిమాండ్ చేశారు. చైనా ఈ కొత్త వ్యాధి ప్రమాదాల గురించి మరింత సమాచారం పొందే వరకు అమెరికా- చైనా మధ్య రాకపోకల్ని నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని నివారించే అవకాశం ఉంది.. యూఎస్ లో మరణాలు, లాక్డౌన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని వెల్లడించారు.
Read Also: Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీ.. నేడు సీడబ్ల్యూసీ సమావేశం
అయితే, చైనాలో వ్యాప్తి చెందుతున్న వైరల్ ని యునైటెడ్ స్టేట్స్ నిశితంగా పరిశీలించింది. అయితే ఇది కాలానుగుణ వ్యాధిగా కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన అధికారి తెలిపారు. చైనా నుంచి వచ్చి యూఎస్ అత్యవసర విభాగాలలో చేరిన వ్యక్తులు శ్వాసకోశ వ్యాధి ఉన్నవారిలో ఎలాంటి పెరుగుదల ఉన్నట్లు లేదు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..