ICC: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరిని వరించిందో తెలుసా..?
- ప్లేయర్ ఆఫ్ ద మంత్ను ప్రకటించిన ఐసీసీ
- పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి అవార్డు
- మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్కు అవార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్లేయర్ ఆఫ్ ద మంత్ను ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి ఈ నెల (అక్టోబర్)లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. అలాగే.. మహిళల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో నోమన్ అద్భుతమైన బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది. నోమన్ రెండు మ్యాచ్ల్లో 13.85 సగటుతో మొత్తం 20 వికెట్లు తీశాడు. తొమ్మిదేళ్ల తర్వాత ఇంగ్లండ్పై పాక్ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
Read Also: Mallu Ravi: బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు..
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
నోమన్ అలీ (38) దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్లను అధిగమించి ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఏడాదికి పైగా రోజుల తర్వాత పాకిస్థానీ ఆటగాడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది ఆగస్టులో బాబర్ ఆజం ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా నోమన్ మాట్లాడుతూ.. “నేను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైనందుకు సంతోషిస్తున్నాను. నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడంలో నాకు సహాయం చేసిన నా సహచరులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాకిస్తాన్ ఇంగ్లాండ్పై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది.” అని తెలిపాడు.
Read Also: Banking Rules: మీకు అలా జరిగిందా? అయితే బ్యాంకు మీకు రోజుకు రూ.100 చెల్లించాల్సిందే
మరోవైపు.. అమేలియా కెర్ (28) అక్టోబర్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ను ఛాంపియన్గా చేయడంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కెర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా ఎంపికైంది. ఫైనల్లో 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా మూడు వికెట్లు తీసింది. ఆమె మొత్తం టోర్నమెంట్లో 15 వికెట్లు పడగొట్టింది. ఇది ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు కూడా సాధించింది. ఆమె బ్యాట్తో ఆరు మ్యాచ్ల్లో 135 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!