ICC: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరిని వరించిందో తెలుసా..?
- ప్లేయర్ ఆఫ్ ద మంత్ను ప్రకటించిన ఐసీసీ
- పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి అవార్డు
- మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్కు అవార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్లేయర్ ఆఫ్ ద మంత్ను ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి ఈ నెల (అక్టోబర్)లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. అలాగే.. మహిళల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో నోమన్ అద్భుతమైన బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది. నోమన్ రెండు మ్యాచ్ల్లో 13.85 సగటుతో మొత్తం 20 వికెట్లు తీశాడు. తొమ్మిదేళ్ల తర్వాత ఇంగ్లండ్పై పాక్ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
Read Also: Mallu Ravi: బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు..
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
నోమన్ అలీ (38) దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్లను అధిగమించి ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఏడాదికి పైగా రోజుల తర్వాత పాకిస్థానీ ఆటగాడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది ఆగస్టులో బాబర్ ఆజం ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా నోమన్ మాట్లాడుతూ.. “నేను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైనందుకు సంతోషిస్తున్నాను. నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడంలో నాకు సహాయం చేసిన నా సహచరులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాకిస్తాన్ ఇంగ్లాండ్పై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది.” అని తెలిపాడు.
Read Also: Banking Rules: మీకు అలా జరిగిందా? అయితే బ్యాంకు మీకు రోజుకు రూ.100 చెల్లించాల్సిందే
మరోవైపు.. అమేలియా కెర్ (28) అక్టోబర్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ను ఛాంపియన్గా చేయడంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కెర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా ఎంపికైంది. ఫైనల్లో 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా మూడు వికెట్లు తీసింది. ఆమె మొత్తం టోర్నమెంట్లో 15 వికెట్లు పడగొట్టింది. ఇది ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు కూడా సాధించింది. ఆమె బ్యాట్తో ఆరు మ్యాచ్ల్లో 135 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!