AP Assembly: సభలో మీసాలు మెలేసిన బాలకృష్ణ.. సభలో ఉద్రిక్తత.. అసెంబ్లీ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు.. ప్లకార్డులతో సభలో నినాదాలు చేశారు.. జై డెమోక్రసీ అంటూ నినదించారు టీడీపీ సభ్యులు.. వాయిదా తీర్మానంపై చర్చ కోసం పట్టుబట్టారు.. స్పీకర్ పోడియం ఎక్కి నినాదాలు చేశారు.. స్పీకర్ పై కాగితాలు చింపి వేశారు టీడీపీ సభ్యులు.. స్పీకర్ టేబుల్ పై ఉన్న మైక్, ఇతర వస్తువులను ధ్వంసం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని తప్పుపడుతూ ముందుకు వచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, బియ్యపు మధుసూదన్ రెడ్డి.. స్పీకర్ పోడియం దగ్గరకు టీడీపీ, వైసీపీ సభ్యులు పోటాపోటీగా రావడంతో.. వారిని వారించిన స్పీకర్.. సహనం పాటించాలని కోరారు.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదంతో సభలో గందరగోళం నెలకొంది.
Read Also: Ambati Rambabu: అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు తప్పును ఒప్పుకోండి..
Also Read
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
మరోవైపు.. అసెంబ్లీలో మీసాలు మెలేశారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. దీనికి ప్రతిగా బియ్యపు మధు తొడగొట్టారు.. ఇక, బాలయ్య మీసాలు మెలేయడంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. సినిమాల్లో మీసాలు మెలేయండి ఇక్కడ కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు.. స్పీకర్ పోడియం ముందుకు టీడీపీ, వైసీపీ సభ్యులు దూసుకెళ్లడంతో.. లేచి నిలబడి దండం పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ సభ్యులను వెనక్కి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.. అయినా సభలో ఆందోళన కొనసాగడంతో.. అసెంబ్లీని వాయిదా వేశారు.. ఇక, స్కిల్ స్కాంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి బుగ్గన.. చంద్రబాబు అరెస్ట్ చర్చపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ప్రతిసారి అర్థంపర్థంలేని వాయిదా తీర్మానం ఇచ్చి సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వేసే ప్రశ్నలకు టీడీపీ వాళ్ల దగ్గర సమాధానం ఉందా? అని నిలదీశారు మంత్రి బుగ్గన. మరోవైపు.. టీడీపీ సభ్యులతో పాటు పోడియం ఎక్కి ఆందోళన చేశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఆ మధ్యే ఆమె వైసీపీకి గుడ్బై చెప్పిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!