R.Krishnaiah : బీసీ కులగణననతో పాటు.. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ కులగణననతో పాటు.విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఛలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్.కృష్ణయ్య.పలువురు బీసీ సంఘాలతో కలిసి ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఇంతవరకు కులగణన చేయడం లేదని.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బిసి ల రిజర్వేషన్లు 42 శాతం కు పెంచడం లేదని కృష్ణయ్య ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధిక్కరిస్తారా అని ప్రశ్నించారు. కామారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా పంచాయితీ రాజ్ మున్సిపల్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు 20 నుండి 42 శాతం కు పెంచాలని డిమాండ్ చేశారు. మరో వైపు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించమని. విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో పోరాడుతమన్నారు. బీసీ సమస్యలపై రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే… రాబోయే రోజులలో లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.
XEC Covid Variant: కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. దీని లక్షణాలు ఏమిటి..?
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..