Alleti Maheshwar Reddy : బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా
- కార్యకర్తల తలలు పగలగోట్టారు
- రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా ?
- ఏం చెప్పాలని అనుకుంటున్నారు.. ఏమిటి ఈ సంస్కృతి : మహేశ్వర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి, రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Formula E Car Race Case : కేటీఆర్కు దెబ్బ మీద దెబ్బ.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ఈ దాడిలో ఓ బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనికి ప్రతిగా, కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసన సభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నానన్నారు. బీజేపీ కార్యాలయం పై కాంగ్రెస్ దుండగులను పంపించి దాడులు చేశారని, కార్యకర్తల తలలు పగలగొట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ఏం చెప్పాలని అనుకుంటున్నారు.. ఏమిటి ఈ సంస్కృతి.. రాష్టానికి హోంమంత్రి లేరు.. సీఎం ఏం చెప్పాలని అనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ దీనికి బాధ్యత వహించాలని, మహేష్ కుమార్ గౌడ్ వి చిల్లర చేష్టలు అని ఆయన ధ్వజమెత్తారు. దాడికి బాధ్యత వహించి మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలని, హోం మంత్రి సీఎం చేతుల్లో ఉంది ఆయన రాజీనామా చేస్తారా ? అని ఆయన దుయ్యబట్టారు. దీంతోపాటు.. ఫార్ములా ఈ రేసు కేసు గురించి మాట్లాడుతూ.. కేటీఆర్ అధికారుల ప్రమేయం ఉందని అంటున్నారని, అధికారులను కేటీఆర్ బెదిరించారన్నారు. కేటీఆర్ నిర్దోషి ఐతే నిలబడి ఎదుర్కోవాలని, వాస్తవాలను బయటపెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు మహేశ్వర్ రెడ్డి.
Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!