Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..
- ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..
- ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు..
- త్రముఖ పోరుతో ఉత్కంఠగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
Delhi Election Schedule: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం.. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి.. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు. అతి త్వరలో ఒక బిలియన్ ఓటర్లకు చేరుకుంటామన్నారు. అందులో మహిళా ఓటర్లు 48 కోట్లకు పైగా ఉన్నారు. ఇక, ఓట్ల తొలగింపు ఆరోపణలను సైతం ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Rajinikanth: రిపోర్టర్పై ‘సూపర్ స్టార్’ అసహనం!
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
అలాగే, ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని చీఫ్ ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈవీలంతోనే పారదర్శకంగా ఫలితాలు వస్తాయి.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, ఈవీఎంలు రిగ్గింగ్ చేయడం కూడా సాధ్యం కాదు.. ఓటరు జాబితాను సిద్ధం చేసే ప్రతి దశలోనూ పాల్గొనే రాజకీయ పార్టీలకు పూర్తి సమాచారంతో పాటు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
Read Also: Daaku Maharaaj : తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో డాకు మహారాజ్ రిలీజ్
ఇక, ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా అందులో 58 జనరల్ స్థానాలు ఉన్నాయి. మరో 12 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే, మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 83. 49 లక్షలు, మహిళలు 71. 74 లక్షలు ఉండగా.. యంగ్ ఓటర్లు 25.89 వేల మంది ఉండగా.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 2.08 లక్షలు, వికలాంగులు 79, 436 మంది, వయోవృద్ధులు 830, ట్రాన్స్ జెండర్స్ 1261 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
తాజావార్తలు
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో