Tirumala Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Alert: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.. ప్రతీ రోజు తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. ఇక, ఏదైనా ప్రత్యేక రోజుల్లో అయితే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడడం చూస్తుంటాం.. అయితే, శ్రీవారి దర్శనానికి, శ్రీవారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల అవుతాయని.. మరోవైపు మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు..
Read Also: Dubai Flood: దుబాయ్ వరదలను అంతరిక్షం నుంచి చూస్తే.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ఇక, రేపు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకుని.. సంబంధిత టికెట్లను భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అనుభవాలు చూస్తే.. నిమిషాల వ్యవధిలోనూ టికెట్ల కోటా పూర్తిస్థాయిలో బుక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న విషయం విదితమే.. మరోవైపు.. తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి.. ఇవాళ మలయప్పస్వామి, రాములవారు, శ్రీకృష్ణ స్వాములకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 62,894 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 22894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లుగా వెల్లడించారు.. తిరుమలలో వసంతోత్సవాలు కారణంగా ఇవాళ పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.
తాజావార్తలు
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!