Tirumala Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Alert: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.. ప్రతీ రోజు తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. ఇక, ఏదైనా ప్రత్యేక రోజుల్లో అయితే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడడం చూస్తుంటాం.. అయితే, శ్రీవారి దర్శనానికి, శ్రీవారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల అవుతాయని.. మరోవైపు మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు..
Read Also: Dubai Flood: దుబాయ్ వరదలను అంతరిక్షం నుంచి చూస్తే.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ఇక, రేపు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకుని.. సంబంధిత టికెట్లను భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అనుభవాలు చూస్తే.. నిమిషాల వ్యవధిలోనూ టికెట్ల కోటా పూర్తిస్థాయిలో బుక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న విషయం విదితమే.. మరోవైపు.. తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి.. ఇవాళ మలయప్పస్వామి, రాములవారు, శ్రీకృష్ణ స్వాములకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 62,894 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 22894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లుగా వెల్లడించారు.. తిరుమలలో వసంతోత్సవాలు కారణంగా ఇవాళ పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.
తాజావార్తలు
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!