నాన్ వెజ్ ప్రియులకు షాక్..మరో కొత్త వ్యాధి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు మటన్ ప్రియులా. అయితే తస్మాత్ జాగ్రత్త. తాజాగా గొర్రెలకు అంత్రాక్స్ వ్యాధి సోకుతుండటంతో… నాన్ వెజ్ ప్రియులు అలర్ట్గా ఉండాల్సిందే. ఇన్ని రోజులు మాంసం ప్రియులను బర్డ్ ఫ్లూ వణికించగా.. ఇప్పుడు ఆంత్రాక్స్ కలవరపెడుతోంది. అంత్రాక్స్ సోకిన గొర్రె మాంసంతో వండిన మటన్ తిన్నారో.. మీకూ రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తెలంగాణ వ్యాప్తంగా ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మృత్యువాతపడ్డాయి. దీంతో అలర్టైన ఆరోగ్యశాఖ.. చుట్టుపక్కల ఊర్లో గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.హైదరాబాద్లోని మేకలమండికి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచే కాకుండా… ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, పొట్టేల్లు వస్తుంటాయి. అక్కడ నుంచి హోటళ్లు, రెస్టారెంట్లకు మాంసం సప్లై అవుతుంది. ఎక్కువ శాతం మేక మాంసంతోపాటు.. గొర్రె మాంసం కూడా హోటళ్లు, రెస్టారెంట్లలోని మటన్ లో ఉంటుంది. ప్రస్తుత తరుణంలో… మటన్ తినాలనుకునే వాళ్లు అలర్ట్గా ఉండాలంటున్నారు డాక్టర్లు. మటన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించకతప్పడం లేదు. గొర్రెలు, లేదా మేకలను కోసే ప్రాంతానికి వెళ్లి మటన్ తెచ్చుకునే వాళ్లు… జీవాలను కోసేటప్పుడే గమనించాలంటున్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
వాటిని కోసినప్పుడు వెలువడే రక్తం వెంటనే గడ్డకట్టకుండా… ద్రవ రూపంలోనే ఉంటే వాటికి ఆంత్రాక్స్ సోకినట్లు గుర్తించాలంటున్నారు. ఆంత్రాక్స్ సోకిన గొర్రెలు, మేకల మాంసాన్ని తినడమే కాదు.. తాకడం కూడా ప్రమాదమే అంటున్నారు. ఆంత్రాక్స్ సోకిన జీవాలను అమ్మవద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఒకసారి ఒక ప్రాంతంలో ఆంత్రాక్స్ వ్యాపిస్తే… దాని ఎఫెక్ట్ 60 ఏళ్ల పాటు ఉంటుందని అంటున్నారు వైద్యులు. ఆంత్రాక్స్ తో చనిపోయిన జీవాల కళేబరాలను పూడ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వాటిని పూడ్చేటప్పుడు… సున్నం చల్లి పూడ్చాలంటున్నారు. లేకపోతే… వాటిని పూడ్చిన పరిసరాల్లో గడ్డి, నీరు, గాలి ద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదముందంటున్నారు. ముఖ్యంగా 100 డిగ్రీల ఊష్ణోగ్రతపైనే ఉడికించిన మాంసాన్ని తినాలని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ తినడం మానేసి మటన్ కు అలవాటు పడితే… ఇప్పుడు ఆంత్రాక్స్ వచ్చి మటన్ కు కూడా దూరం చేసింది అంటూ ఆవేదన చెందుతున్న మాంసంప్రియులు కూడా ఉన్నారు.ఎందుకైనా మంచింది కొన్నిరోజులపాటు నాన్ వెజ్ తినకపోవడమే బెటర్ అనుకుంటున్నవారు మరికొందరు. ఇదిలా ఉంటే… ఈ ఎఫెక్ట్ తోనైనా చుక్కలనంటిన మాంసం ధరలు దిగివస్తే బాగుండు అనుకునే మధ్యతరగతి జీవులు కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గలకు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!