Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Akhilesh Yadav On Seat Sharing Within India Bloc

Akhilesh Yadav: ఇండియా కూటమి నుంచి అఖిలేష్‌ యాదవ్ ఔట్!

Published Date :October 20, 2023 , 5:07 pm
By Mahesh Jakki
Akhilesh Yadav: ఇండియా కూటమి నుంచి అఖిలేష్‌ యాదవ్ ఔట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Akhilesh Yadav: 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని విపక్ష పార్టీ ఒక్కతాటిపై నిలిచి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ఏర్పాటు చేసినంత ఈజీగా లెక్కలు తేలడం లేదు. దేశంలోని కీలక విపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ.. ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కాంగ్రెస్​ పార్టీనే ముఖ్య కారణమని తెలుస్తోంది.

Also Read: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..

త్వరలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందులో మధ్యప్రదేశ్​ కూడా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తర్​ ప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోనూ కాస్త పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో.. తాము బలంగా ఉన్న స్థానాల్లో బరిలో దిగుతామని, కాంగ్రెస్​ అవకాశం ఇవ్వాలని అఖిలేశ్​ యాదవ్​ చెప్పారు. ఆ మాటలను కాంగ్రెస్​ పట్టించుకోలేదు. ఫలితంగా.. ఇప్పుడు.. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు అభ్యర్థులను దింపుకున్న పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడంలో సమాజ్‌వాదీ పార్టీ విఫలమవడంతో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌పై తన మాటల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్‌ను ద్రోహమని బహిరంగంగా విమర్శించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత.. ఈ గందరగోళం కొనసాగితే ఇండియా కూటమి బీజేపీని ఎప్పటికీ ఓడించలేదని అన్నారు.

Also Read: Bussiness Idea : రైతులకు బెస్ట్ బిజినెస్.. ఈ పంటను ఒక్కసారి వేస్తే చాలు.. ఏడేళ్ల వరకు డబ్బులే డబ్బులు..

“కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో సీట్లు ఇవ్వకూడదనుకుంటే ముందే చెప్పాల్సింది.. ఈరోజు ఎస్పీ తన సొంత పార్టీ ఉన్న సీట్లపైనే పోరాడుతోంది. మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​ కమల్‌నాథ్‌తో మాట్లాడాను. మధ్యప్రదేశ్‌లో పార్టీ బలం గురించి వివరించాను. గతంలో మా ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారు? ఎక్కడ నెంబర్​.2గా నిలిచారో చెప్పాను. మాకు 6 సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్​ చెప్పింది. ఇక అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎస్​పీ ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో కూటమి లేదని నాకు ముందే తెలిస్తే.. అసలు కలిసేవాడినే కాదు కదా! కాంగ్రెస్‌తో మాట్లాడే వాడినే కాదు కదా!. జాతీయ స్థాయిలో జరిగే (పార్లమెంటరీ) ఎన్నికల కోసం.. కాంగ్రెస్ ఇలాగే కొనసాగితే, వారితో ఎవరు నిలబడతారు?. మన మనస్సులో గందరగోళంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే విజయం సాధించలేము.” అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

Also Read: Karnataka: ఇంట్లో గొడవలు.. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఇండియా కూటమి ఏర్పడినప్పటికీ, ఎస్పీ వ్యూహం PDA (పిచాడ, దళిత, అల్పసంఖ్యక్) కోసం పనిచేయడంపై ఆధారపడి ఉంటుందని ఎస్పీ చీఫ్ చెప్పారు. “మొదట PDA ఏర్పడింది. తర్వాత ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి ఉన్నప్పటికీ మా వ్యూహం పీడీఏనేనని.. PDA NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్)ని ఓడించగలదని నేను చాలా సందర్భాలలో చెప్పాను.” ఎస్పీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. షాజహాన్‌పూర్‌లో జరిగిన ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ హాజరవుతూ.. బీజేపీ నుంచి నుంచి భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కుట్రల గురించి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించడానికి అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి, భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు, కుట్రలు ఎదుర్కోవాల్సి ఉంటుందో, ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ ఎలా దుర్వినియోగం చేస్తుందో పార్టీ కార్యకర్తలకు తెలియజేయాలి. దుష్ప్రచారాన్ని అడ్డుకుని, సత్యాలను ప్రచారం చేయాలి.” అని కార్యకర్తలకు అఖిలేష్ యాదవ్ సూచించారు. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమి భవిష్యత్తు అయోమయంలో పడినట్లే కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhilesh Yadav
  • congress
  • INDIA Bloc
  • madhyapradesh elections
  • national news

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions