Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Adluri Laxman Kumar Fires On Brs

Adluri Laxman Kumar : నిర్వాసితుల కష్టాలపైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు..

Published Date :October 1, 2024 , 4:49 pm
By Gogikar Sai Krishna
  • కేసీఆర్ అధికారంలో భూ నిర్వాసితులను పట్టించుకోలేదు
  • కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు
  • నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు
  • ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారు
Adluri Laxman Kumar : నిర్వాసితుల కష్టాలపైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్వాసితుల కష్టాల పైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆయన వెల్లడించారు. నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని, ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారని,
నిర్వాసితుల కోసం పోరాడిన మాపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు అడ్లూరి లక్ష్మణ్‌. నిర్వాసితుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదని, హైదరాబాద్ నాలాల పైన 28 వేల అక్రమ కట్టడాలున్నాయని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆరే చెప్పాడన్నారు. మూసీ రివర్ బెడ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారని, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్

అంతేకాకుండా..’మా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఎక్కడా అడ్డుకోవడం లేదు..  బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు.. నాయకత్వం కోసం హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడి హడావిడి చేస్తున్నాడు..  అక్రమణదారులు పేదలను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం లపైన చర్చకు వచ్చే దమ్ము కేటీఆర్ కు ఉందా… ?  కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కు ప్రతిపక్షాలు, మీడియా వెళ్లకుండా తాళాలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది..  ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయించాల్సిన అవసరం మా సీఎం రేవంత్ రెడ్డికి లేదు.. తన పైన వ్యక్తిగతంగా  చెత్త వాగుడు వాగిన కౌశిక్ రెడ్డి నే మా సీఎం రేవంత్ రెడ్డి వదిలేశాడు..  ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది..  మా సీఎం కక్ష సాధింపు చర్యలు దిగరు.. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరు.. ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఖతం అయింది..  బీఆర్ఎస్ ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన మాజీ నేతలు కనిపించడం లేదు… ఖజానా ఖాళీ చేసి పోయినప్పటికి మా సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు..  ఈడీ దాడులు చేస్తున్నా మా మంత్రి పొంగులేటి సెక్రటేరియట్ కు వచ్చి సమీక్షలు చేశారు ..  సోషల్ మీడియాలో విష ప్రచారం కోసం బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది ‘ అని అడ్లూరి లక్ష్మణ్‌ ఆరోపించారు.

Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adluri Laxman Kumar
  • breaking enws
  • BRS
  • HYDRA
  • latest news

తాజావార్తలు

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

  • LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

  • Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions