adala prabhakar reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
adala prabhakar reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎపిసోడ్ వైఎస్సార్సీపీలో కాకరేపుతోంది. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అంటూ మంత్రులు చెబుతుండగా.. నిగ్గు తేల్చేందుకు రంగంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు దిగారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియోపై వివరాలను సేకరిస్తున్నారు. శ్రీధర్ రెడ్డితో మాట్లాడిన రామ శివారెడ్డిని విచారించే అవకాశం ఇంది. రామ శివారెడ్డి ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఇవాళ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్తో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఇన్ఛార్జీగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ను కలుస్తున్నామని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్నానన్న ఆయన.. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యల సంగతి తనకు తెలియదన్నారు.
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
Nedurumalli Ramkumar Reddy: ఆనంకు నేదురుమల్లి సవాల్.. దమ్ముంటే వెంకటగిరిలో పోటీ చేయాలి..
పార్టీకి డ్యామేజ్ చేసే స్థాయి కోటంరెడ్డికి లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ దయతో కోటంరెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారన్నారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని తాను చేసిన ఛాలెంజ్కు కోటంరెడ్డి నుంచి సమాధానం లేదన్నారు. తన స్నేహితుడే ఫోన్ రికార్డ్ చేశాడని కోటంరెడ్డికి కూడా తెలుసన్నారు. ఆయన నియోజకవర్గంలో అతనే రాజ్యం చేశాడని.. మరి ఎందుకు అసంతృప్తి అంటూ ప్రశ్నించారు. ఇన్ఛార్జి ఎవరో ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని మాజీ మంత్రి బాలినేని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!