Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Action Plan Is Prepared For The Release Of Irrigation Water Required For Rabi Says Ap Ministers

Andhrapradesh: రబీకి అవసరమైన సాగునీటి విడుదలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం

Published Date :November 15, 2023 , 7:32 pm
By Mahesh Jakki
Andhrapradesh: రబీకి అవసరమైన సాగునీటి విడుదలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Andhrapradesh: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తం చేస్తున్నామని అని బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ , హోం మంత్రి తానేటి వనితలు పేర్కొన్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో రబీకి అవసరమైన సాగు నీరు (డిసెంబర్- 23 నుండి మార్చి-24 వరకు) సరఫరా కార్యాచరణ ప్రణాళిక పై జిల్లా స్థాయి నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ , హోం మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథి హజరవ్వగా, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, ఎంపీ మార్గాని భరత్ రామ్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే లు జక్కంపూడి రాజా , సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది.

Also Read: BV Raghavulu: తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదు.. బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో వరికి అనుకూలంగా ఉన్న 64,361 ఎకరాల సాగు విస్తీర్ణం కలిగిన భూములకు సాగునీరు అందించే క్రమంలో నీటి ఎద్దడి వచ్చినా ఎదుర్కునే విధంగా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏ ఒక్క ఎకరా భూమి కూడా నీటి లభ్యత లేని కారణంగా పంట వెయ్యకుండా ఉండకూడదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అవసరమైన నిధులను సమకూర్చడం జరుగుతుందని హామీ ఇచ్చారన్నారు. నీటి లభ్యత ఎక్కడ ఉంది, వాటిని ఎలా సమీకరించి రైతుకి ఏ విధంగా బాసటగా నిలవగలం అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. ఆ దృక్పథం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి నట్లు మంత్రి వేణుగోపాల్ తెలిపారు. ఆ మేరకు నవంబర్ నెలాఖరు నాటికి ఖరీఫ్ సీజన్ కోతలు పూర్తి చేసి, డిసెంబర్ 1 నుంచి 10 లోగా రబీ సీజన్ నాట్ల కోసం రైతులను సంసిద్ధం చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు నాట్లు ప్రారంభించడం ద్వారా డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా పంట వేసిన వారిని ఏ విధంగా రబీ కి సిద్దం చెయ్యగలమో అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆమేరకు సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కింద రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి నిలువ ఏ విధంగా ఉంచాలనే అంశం కూడా చర్చించి, ఆమేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించిన ట్లు మంత్రి వేణు పేర్కొన్నారు.

Also Read: Minister KTR : వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌

పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసి రైతుకు అన్ని విధాలా భరోసా ఇచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు తెలిపారు. ఆమేరకు శాసన సభ్యులు, రైతు లు, రైతు సంఘాల నాయకులు సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేసి నట్లు పేర్కొన్నారు. రబీ పంట పండిస్తామా ? లేదా? అనే ఆందోళనలో ఉన్న పత్రికల్లో కథనాలు, ప్రతి పక్షాల ఆరోపణలు పుల్ స్టాప్ పెడుతూ రైతులకు సకాలంలో సాగునీరు అందించడం దిశగా అడుగులు వేయడం జరిగింది. ఈమేరకు ముఖ్యమంత్రికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము అని పేర్కొన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని, ఎవ్వరూ ఎన్ని విమర్శలు చేసినా, రైతుల పక్షాన నిలబడి పని చేస్తామని స్పష్టం చేశారు.

హోమ్ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ప్రతి ఒక్క నీటి బొట్టు వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందని, ఆ క్రమంలో ప్రతి నియోజక వర్గ పరిధిలో ఆయకట్టు కు సాగు నీరు అందించే సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు.  గత సీజన్లో రైతులకు సకాలంలో సాగునీరు అందించగలిగామని, క్రమంలో రైతులు ఈ రబీ సీజన్లో ఆమేరకు సాగునీరు అందించాల్సి ఉంటుందన్నారు. బాధ్యత మనపై ఉందని హోం మంత్రి గుర్తు చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వ విధానంలో రైతు స్నేహ పూర్వక విధానం అమలు చేయడం జరుగుతోందని అన్నారు. రాబోయే రబీ సీజన్లో పూర్తి స్థాయిలో సాగు విస్తీర్ణం చేసేందుకు అవసరమైన నీటి వనరుల పంపిణీ చేయాల్సి ఉందన్నారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • AP Irrigation
  • ap news
  • Minister Venugopalkrishna
  • Rabi Season

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions